అకౌంట్లో సరిపడా డబ్బుల్లేవ్.. కానీ భయపడను
ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి నటన మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ రౌడీగా పేరు తెచ్చుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో కథానాయకుడిగా మారిన ఆయన ‘అర్జున్రెడ్డి’, ‘గీత గోవిందం’...
మంచి పనులతో ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ
హైదరాబాద్: ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి నటన మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ రౌడీగా పేరు తెచ్చుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో కథానాయకుడిగా మారిన ఆయన ‘అర్జున్రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన విజయ్.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయాలనే లక్ష్యంతో ఓ మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చారు. అంతేకాకుండా లాక్డౌన్ పూర్తయ్యాక చాలామంది ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. తన వంతుగా కొంత మందికి ఉద్యోగం విషయంలో సాయం చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.
‘మై లవ్స్. ఐ మిస్ యూ ఆల్. నేను మీ అందరి గురించి ఆలోచిస్తుంటాను. మీ అందరూ సంతోషంగా, జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే.. ఆ పేరు కూడా చెప్పాలని లేదు. ఎందుకంటే దాని పేరు విని, విని చిరాకు వచ్చేసింది. కానీ ఇది మనందర్నీ కట్టి, కొట్టింది. నన్ను కూడా. ఇలాంటి పరిస్థితులకు నేను మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా లేను. చూస్తే అకౌంట్లో సరిపడా డబ్బుల్లేవు. మా కుటుంబంతోపాటు 35 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత నాపై ఉంది. డబ్బుల్లేకపోవడం కొత్తేం కాదు. అలవాటే.. భయపడను. కానీ 35 మందికి జీతాలు ఇవ్వడం అనేది కొత్త. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను రెండు మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చా. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు సాయం చేయడం.. రెండోది భవిష్యత్లో ఉద్యోగాల విషయంలో కొందరికి సాయం చేయడం’ అని విజయ్ దేవరకొండ తెలిపారు. అనంతరం ఆయన రూ.1.30 కోట్ల ఫండ్ను వివిధ పద్ధతుల్లో ప్రజలకు సాయం చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి
విజయ్ దేవరకొండ ఇల్లు చూశారా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్