కరోనాపై భారత్‌ పోరు.. స్కెచ్‌తో బ్రహ్మానందం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనలోని కళను మరోసారి అందరికీ పరిచయం చేశారు. నటుడిగానే మనందరికీ పరిచయం ఉన్న బ్రహ్మానందంలో ఓ మంచి డ్రాయింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా ఉన్నారు. షూటింగ్స్‌ నుంచి కొంత ఖాళీ దొరికితే ఆయన పలు స్కెచ్‌లు వేస్తుంటారు...

Published : 03 May 2020 11:24 IST

మరోసారి తన ప్రతిభతో మెప్పించిన హాస్యనటుడు

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనలోని కళను మరోసారి అందరికీ పరిచయం చేశారు. నటుడిగానే మనందరికీ పరిచయం ఉన్న బ్రహ్మానందంలో ఓ మంచి డ్రాయింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా ఉన్నారు. షూటింగ్స్‌ నుంచి కొంత ఖాళీ దొరికితే ఆయన పలు స్కెచ్‌లు వేస్తుంటారు. తాజాగా బ్రహ్మానందం కరోనా నియంత్రణ కోసం భారత్‌ చేస్తున్న పోరును ఓ స్కెచ్‌ రూపంలో చూపించారు. ఈ మేరకు ఆయన భారత్‌ లాక్‌డౌన్‌ అనే అస్త్రంతో కరోనా వైరస్‌కే భయం తెప్పిస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఆయన వేసిన స్కెచ్‌ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. కొన్ని వందల చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించిన బ్రహ్మానందం ఇటీవల ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో అతిథి పాత్రలో సందడి చేశారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు బ్రహ్మానందం.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తున్నారు. మరాఠిలో మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు