రెండు బస్సులు ఏర్పాటు చేసిన మనోజ్‌

వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు యువ కథానాయకుడు మంచు మనోజ్‌ ముందుకొచ్చారు. తనవంతు సాయంగా వారి కోసం బస్సులు ఏర్పాటు చేసినట్లు ట్వీట్‌ చేశారు. ఈ మంచి కార్యానికి అందరి సహకారం కావాలని, అప్పుడే వలస కార్మికుల్ని వారి వారి ఇళ్లకు పంపొచ్చని పేర్కొన్నారు....

Updated : 20 May 2020 20:08 IST

హైదరాబాద్‌: వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు యువ కథానాయకుడు మంచు మనోజ్‌ ముందుకొచ్చారు. తన వంతు సాయంగా వారి కోసం బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు రెండు బస్సులు ఏర్పాటు చేశారు. వారికి ఆహారంతో పాటు మాస్కులు, శానిటైజర్లు స్వయంగా అందజేశారు. కొబ్బరికాయ కొట్టి బస్సులు ప్రారంభించారు. బస్సుల్లో వారిని తరలించేందుకు సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి తెచ్చుకున్నట్లు మనోజ్‌ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సేవల్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నానని మనోజ్‌ చెప్పారు.

మనోజ్‌ బుధవారం తన పుట్టినరోజు జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన‌ ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రాన్ని విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌ సమర్పిస్తున్నారు. మనోజ్‌ 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో చివరిసారి వెండితెరపై కనిపించారు. ఆపై సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు చెప్పారు. తిరిగి ఇప్పుడు మళ్లీ మేకప్‌ వేసుకోబోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని