Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. కొత్త ట్రెండ్‌కు శ్రీకారం

మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై చిత్ర బృందం అప్‌డేట్‌ ఇచ్చింది.

Published : 03 Jan 2024 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్ర బృందం కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టనుంది. తమ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను (Guntur Kaaram Pre Release Event) యూఎస్‌ థియేటర్‌లో లైవ్‌ టెలీకాస్ట్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని సినీ లాంజ్‌ ఫ్రీమాంట్‌ 7 సినిమాస్‌ స్క్రీన్‌పై వేడుక దృశ్యాలు ప్రదర్శితం కానున్నాయి. సినీ వేడుకలు వెండితెరపై కనిపించనుండడం చిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. ఆ సెలబ్రేషన్‌ ఎప్పుడుంటుందనే వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. ఈ నెల 5న హైదరాబాద్‌లో ఉండొచ్చని సమాచారం.

పెద్ద ప్లానింగే..! రాజమౌళి-మహేశ్‌ మూవీ ట్రెండింగ్‌ న్యూస్‌ ఇదే!

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీలీల (Sree Leela), మీనాక్షి చౌదరి కథానాయికలు. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు, పాటలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని