NTR: టాలీవుడ్లో ఫ్యాన్స్ వార్.. ఎన్టీఆర్పై హెచ్సీఏ ఆసక్తికర ట్వీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)ను ఉద్దేశిస్తూ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి గానూ ఎన్టీఆర్, అలియాభట్(Alia Bhatt)కు అవార్డులు పంపిస్తున్నట్లు చెప్పింది.
ఇంటర్నెట్డెస్క్: సోషల్మీడియా వేదికగా టాలీవుడ్ (Tollywood) సినీ ప్రియుల మధ్య ఎంతో కాలం నుంచి కోల్డ్ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్సీఏ) (HCA) అవార్డుల ప్రదానోత్సవంతో ఇప్పుడిది మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే హెచ్సీఏకు మద్దతుగా.. ఎన్టీఆర్ అభిమానులను విమర్శిస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దానిపై స్పందించిన హెచ్సీఏ బృందం తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఎన్టీఆర్కు అవార్డులు కొత్తేమీ కాదని చెప్పింది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రానికి గానూ ఎన్టీఆర్ (NTR), అలియా భట్(Alia Bhatt)కు వచ్చేవారం ‘హెచ్సీఏ’ అవార్డులను పంపిస్తున్నామని తెలియజేస్తూ శుక్రవారం ఉదయం సదరు అవార్డు బృందం ఓ ట్వీట్ చేసింది. నటీనటుల పేర్లతో ఉన్న ట్రోఫీల ఫొటోలను షేర్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఒక భారతీయ చిత్రానికి హెచ్సీఏ అవార్డులు ఇవ్వడం ఇదే ఆఖరిసారి కావొచ్చు. ఎందుకంటే, కొంతమంది అభిమానులు అనవసరంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్కు మరెన్నో అవార్డులు రావాలి’’ అని ట్వీట్ చేశాడు. దీనిపై హెచ్సీఏ బృందం స్పందిస్తూ.. ‘‘ఆయనకు ఎప్పుడూ అవార్డులు వస్తూనే ఉంటాయి. కాకపోతే, ఆయన వ్యక్తిగతంగా వచ్చి వాటిని అందుకోలేకపోయారు.’’ అని వివరణ ఇచ్చింది.
హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఒకటి. ఇటీవల ఈ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియాలో వేడుకగా జరిగింది. ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’, ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ కేటగిరిలతోపాటు ‘హెచ్సీఏ’ స్పాట్లైట్ అవార్డును సైతం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) దక్కించుకుంది. రామ్చరణ్ (Ram Charan) ఒక్కడే ఈ కార్యక్రమానికి హాజరు కావడం పై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. ‘ఎన్టీఆర్ని ఆహ్వానించలేదా?’ అంటూ హెచ్సీఏ టీమ్కు ట్వీట్స్ చేయగా.. ఆయన్ని ఆహ్వానించామని, కొత్త సినిమా షూట్లో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేదని రిప్లై ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం