Major: అడివి శేష్‌ ‘మేజర్‌’.. ట్రైలర్‌ చూసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘మేజర్‌’.  26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది.

Published : 06 May 2022 20:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘మేజర్‌’. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది. ట్రైలర్‌ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. దేశభక్తి ప్రధానంగా సాగే కథ కావడంతో ట్రైలర్‌ను ముందుగానే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు చిత్ర బృందం చూపించింది. ట్రైలర్‌ను మెచ్చిన ఆయన చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ‘మేజర్‌’ స్లోగన్‌ను విడుదల చేశారు. సంబంధిత వీడియోను సోషల్‌ మీడియా అభిమానులతో పంచుకుంటూ శేష్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌, ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని