Allu Arjun: ఆ లెటర్‌ చూసి ఆశ్చర్యపోయాను: అల్లు అర్జున్‌

‘పుష్ప’తో ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun). తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 07 Apr 2024 13:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మేడమ్‌ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా నటుడు అల్లు అర్జున్‌ స్పందించారు. మేడమ్‌ టుస్సాడ్స్‌ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి తొలుత ఆశ్చర్యపోయానన్నారు. ‘‘ఓరోజు నేను మా ఆఫీస్‌కు వెళ్లగానే అక్కడి వాళ్లందరూ నిలబడి.. నన్ను చూసి నవ్వుతున్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కొంతసమయానికి వాళ్లు నాకొక లెటర్‌ ఇచ్చారు. లెటర్‌ పూర్తిగా చదవలేదు. మేడమ్‌ టుస్సాడ్స్‌ అని చూడగానే ఆశ్చర్యానికి గురయ్యా. నా మైనపు విగ్రహం చూడగానే సంతోషంగా అనిపించింది. నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. హెయిర్‌ పార్ట్‌ అద్భుతంగా తీర్చిదిద్దారు. నాకు సంబంధించిన మోస్ట్‌ ఐకానిక్‌ పోజుల్లో తగ్గేదేలే పోజు ఒకటి’’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియాన్ని సందర్శించి తన విగ్రహంతో ఫొటోలు దిగాలని కోరారు. దీనికి సంబంధించిన ఓ వీడియో విడుదలైంది.

‘పుష్ప ది రైజ్‌’ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్‌. ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప ది రూల్‌’ చిత్రీకరణలో బిజీగా పాల్గొంటున్నారు. ‘పుష్ప పార్ట్‌1’కు సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. రష్మిక కథానాయిక. సుకుమార్‌ దర్శకుడు. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ‘పుష్ప ది రూల్‌’ టీజర్‌ విడుదల చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని