Kamal Haasan: కమల్‌హాసన్‌ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందా.. వైరల్‌గా మారిన నిర్మాణ సంస్థ ట్వీట్‌

కమల్‌హాసన్‌ (Kamal Haasan) నటించనున్న ఓ ప్రాజెక్ట్‌ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Published : 25 Jan 2024 14:23 IST

చెన్నై: ‘విక్రమ్‌’ (Vikram) తర్వాత కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు అగ్ర నటుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan). ఒక దాని తర్వాత మరొకటి పట్టాలెక్కిస్తున్నారు. ఆయన నటించనున్న ఓ ప్రాజెక్ట్‌ గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది. చిత్ర నిర్మాణసంస్థ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది.

కమల్‌కు చెందిన నిర్మాణసంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై హెచ్‌.వినోద్‌ దర్శకుడిగా గతేడాది ప్రాజెక్ట్‌ ఓకే అయిన విషయం తెలిసిందే. కమల్‌హాసన్‌ 233వ ప్రాజెక్ట్‌గా ఇది ప్రచారంలో ఉంది. కమల్‌ను దృష్టిలో ఉంచుకుని వినోద్‌ పవర్‌ఫుల్‌ పాత్ర సిద్ధం చేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇది ఆగిపోయిందని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ బ్యానర్‌లో రానున్న చిత్రాలను ఉద్దేశించి రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బుధవారం సాయంత్రం ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ ఆ ప్రచారానికి ఊతమిచ్చింది. ‘థగ్‌ లైఫ్‌’, ‘కమల్‌ 237’, ‘శివకార్తికేయన్‌ 21’, ‘శింబు 48’ త్వరలో తమ బ్యానర్‌ నుంచి విడుదల కానున్నట్లు తెలిపింది. కమల్‌ 233 ప్రాజెక్ట్‌ మాత్రం లిస్ట్‌లో లేకపోవడంతో ఇది ఆగిపోయిందని, అందుకే దాని గురించి ప్రస్తావించలేదని నెట్టింట కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కథనాలపై టీమ్‌ నుంచి కానీ, వినోద్‌ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని