BRO movie: జాణవులే.. నా జాను నువ్వులే

ఈ వేసవికి ‘విరూపాక్ష’తో ప్రేక్షకుల్ని అలరించారు సాయిధరమ్‌ తేజ్‌. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు.

Updated : 16 Jul 2023 09:07 IST

వేసవికి ‘విరూపాక్ష’తో ప్రేక్షకుల్ని అలరించారు సాయిధరమ్‌ తేజ్‌. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. కేతిక శర్మ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర రెండో గీతాన్ని శనివారం తిరుపతిలో విడుదల చేశారు. సాయితేజ్‌, కేతికలపై చిత్రీకరించిన రొమాంటిక్‌ పాటిది. ‘‘జాణవులే.. నెరజాణవులే.. నా జాను నువ్వులే’’ అంటూ సాగుతున్న ఈ గీతానికి తమన్‌ స్వరాలు సమకూర్చడమే కాక కె.ప్రణతితో కలిసి స్వయంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. ఈ సినిమాలో మార్కండేయులు పాత్రలో తేజు కనిపించనుండగా.. కాలస్వరూపుడిగా పవన్‌ కల్యాణ్‌ దర్శనమివ్వనున్నారు. ప్రియా ప్రకాష్‌ వారియర్‌, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: త్రివిక్రమ్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని