Janhvi Kapoor: దక్షిణాది సినిమాలో జాన్వీ?... క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తమిళంలో ఓ సినిమా చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ బోనీ కపూర్ (Boney Kapoor) ట్వీట్ చేశారు.
హైదరాబాద్: జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) సౌత్ సినిమాల్లో నటించాలి అంటూ గత కొద్ది రోజులుగా అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు ఆమెకు సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు. ఇదిగో, అదిగో అంటూ ఆమె చెబుతున్నా.. ఇంకా ఏదీ అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలో ఓ సౌత్ సినిమా (South Cinema)లో జాన్వీ నటిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ‘అతిలోక సుందరి కూతురు సౌత్కి వస్తోంది’ అంటూ ఫ్యాన్స్ ఆనందపడిపోయారు. అయితే వారి ఆనందంపై బోనీ కపూర్ (Boney Kapoor) నీళ్లు చల్లారు.
శ్రీదేవి కూతురిగా వెండితెరకు పరిచమైంది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోడానికి కష్టపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల సర్వైవల్ డ్రామా ‘మిలీ’లో (Mili) కనిపించింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించనప్పటికీ... జాన్వీకి మాత్రం నటిగా మంచి మార్కులే పడ్డాయి. దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందని, త్వరలోనే సౌత్ ఫిల్మ్స్లో కనిపించనున్నానని జాన్వీ చెప్పినప్పటి నుంచి ఆమె సినిమాలపై రూమర్స్ మొదలయ్యాయి.
జాన్వీ ఓ తమిళ సినిమా చేస్తుందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇవన్నీ రూమర్సంటూ కొట్టిపడేశారు జాన్వీ తండ్రి బోనీ కపూర్ (Boney Kapoor). ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘జాన్వీ ప్రస్తుతం ఎలాంటి తమిళ చిత్రాలు చేయడం లేదు. తన సినిమాలపై పుకార్లు సృష్టించొద్దు’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు బోనీ. అయితే ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాలో జాన్వీ నటిస్తోందనే వార్తలు కూడా ఆ మధ్య వచ్చాయి. మరి ఆ సినిమా విషయంలోనూ క్లారిటీ వచ్చేస్తే బాగుండు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. వరుణ్ ధావణ్తో ‘బవాల్’ (Bawaal)లో నటిస్తోంది. నీతీష్ తివారీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి ఓ బాలీవుడ్ సినిమాకు పూర్తిస్థాయి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు జాన్వీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ (Mr and Mrs Mahi) అనే సినిమాలోనూ నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా