Keerthy suresh: మద్రాసు ప్రయాణం

దక్షిణాది చిత్రసీమలో చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న నాయికల్లో కీర్తి సురేశ్‌ ఒకరు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తమిళ చిత్రం ‘రఘుతాత’. సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు.

Updated : 13 Jan 2024 10:03 IST

క్షిణాది చిత్రసీమలో చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న నాయికల్లో కీర్తి సురేశ్‌ ఒకరు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తమిళ చిత్రం ‘రఘుతాత’. సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల గ్లింప్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్‌ని సామాజిక మాధ్యమాల ద్వారా శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ‘‘రఘుతాత’లో కయల్విజి పాత్రలో కీర్తి పండించే హాస్య మహోత్సవాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఎక్కడ చూడని వినోదం ఈ చిత్రంతో మీ ముందుకు రానుంది’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. కామెడీని జోడించి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ‘హిందీ పరీక్ష కోసం తమిళంలో దేవుడి సహాయం కోరుతున్నారా? అంటూ ఓ టీచర్‌...నా ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లాలంటే నేను మద్రాసు వెళ్లాలి’ అంటూ కీర్తి పంచిన కామెడీ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో కీర్తి టీచర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని