Malavika Mohanan: అసభ్యకరంగా ఫొటో ఎడిట్‌.. మండిపడ్డ నటి

తన ఫొటోని అసభ్యకరంగా ఎడిట్‌ చేసి,  నెట్టింట షేర్‌ చేసిన పలువురు నెటిజన్లు, తమిళ మీడియా సంస్థలపై యువ నటి మాళవిక మోహనన్‌ మండిపడింది.  తన ఫేక్‌ ఫొటో ఎక్కడైనా కనిపిస్తే తెలపమని అభిమానుల్ని కోరింది.

Published : 04 Feb 2022 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఫొటోని అసభ్యకరంగా ఎడిట్‌ చేసిన వారిపై యువ నటి మాళవిక మోహనన్‌ మండిపడింది. దాన్ని షేర్‌ చేసిన పలువురు నెటిజన్లు, తమిళ మీడియా సంస్థలపై అసహనం వ్యక్తం చేసింది. తన ఫేక్‌ ఫొటో ఎక్కడైనా కనిపిస్తే తెలపమని అభిమానుల్ని కోరింది. ఏమైందంటే.. కొన్ని నెలల క్రితం మాళవిక తన ఫొటోని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోని ఎవరో అసభ్యకరంగా ఎడిటింగ్‌ చేసి ఇటీవల సోషల్‌ మీడియాలో ఉంచారు. మీడియాసహా చాలామంది నెటిజన్లు ఆ ఫొటోని ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో  షేర్‌ చేశారు. ఈ విషయం మాళవిక దృష్టికి వెళ్లగా ఆమె స్పందించింది. సదరు మీడియాను ఉద్దేశిస్తూ ‘ఇది చీప్‌ జర్నలిజం’ అని పేర్కొంది.

కేరళకు చెందిన మాళవిక ‘పట్టాయాం పొలె’ అనే మలయాళం చిత్రంతో నటిగా మారింది. ‘బియాండ్‌ ది క్లౌడ్స్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్‌ ‘పేట’, విజయ్‌ ‘మాస్టర్‌’ సినిమాలతో కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన ‘మారన్‌’ త్వరలోనే విడుదలకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు