
Samantha: ఆ ఐటమ్సాంగ్కు సమంతనే గుడ్ ఛాయిస్..: దేవీశ్రీ ప్రసాద్
ఇంటర్నెట్ డెస్క్: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’లోని ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కెరీర్లోనే తొలిసారి ఈ పాటతో ప్రత్యేక గీతంలో నర్తించింది నటి సమంత. ఈ పాటకు సమంతనే గుడ్ ఛాయిస్ అని, దాని వెనుక ఉన్న కారణాన్ని చెప్పాడు చిత్ర సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ‘‘వాస్తవానికి ఈ పాటంతా సిద్ధమైనా.. ఇందులో ఎవరు నర్తిస్తారన్నది అప్పటికింకా ఫైనల్ కాలేదు. సమంతను ఎంపిక చేయాలన్నది పూర్తిగా దర్శకుడు సుకుమార్, నిర్మాతల నిర్ణయం. ఇక సామ్ని ఫైనల్ చేసిన రెండు రోజుల ముందే నాకా విషయం తెలిసింది. ఈ పాటకు సామ్ని ఓకే చేయడం చక్కటి ఎంపిక. పాటకి ఫ్రెష్ ఫీల్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ఆమెను వివిధ పాత్రల్లో చూశాం. తొలిసారి ఐటమ్ సాంగ్లో కనిపించడం, అలాగే ఆమె మేకోవర్ కూడా చాలా బాగుంది. నా మ్యూజిక్లో నర్తించడం సంతోషంగా ఉంది. తన డ్యాన్స్, లుక్స్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట కోసం తను చేసిన కృషిని అభినందిస్తున్నా’’ అన్నారు.
ఆ విషయాన్ని ఫ్యాన్స్ నా దృష్టికి తీసుకొచ్చారు..
ఈ మధ్యనే ఓ ఫన్ ఫ్యాక్ట్ని అభిమానులు నా పంచుకున్నారు. ‘‘ దక్షిణాది ప్రముఖ కథానాయికులు చేసిన ఐటమ్ సాంగ్స్ కాజల్- పక్కాలోకల్ (జనతా గ్యారేజీ), పూజా హెగ్డే- జిగేల్ రాణి (రంగస్థలం), తమన్నా- స్వింగ్ జరా (జై లవకుశ), ఇప్పుడు.. సమంత- ఊ అంటావా(పుష్ప)’’ఇవన్నీ మీరు కంపోజ్ చేసినవే అంటూ ఫన్నీ మీమ్ షేర్ చేశారు. ఇది నాకు చాలా స్పెషల్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.