‘నరసింహనాయుడు’ కథ అలా పుట్టింది..!
‘కత్తులతో కాదురా...కంటి చూపుతో చంపేస్తా..’ ఈ ఒక్క డైలాగ్తో ‘నరసింహనాయుడు’గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించారు
బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ చిత్రానికి 20ఏళ్లు
ఇంటర్నెట్డెస్క్: ‘కత్తులతో కాదురా...కంటి చూపుతో చంపేస్తా..’ ఈ ఒక్క డైలాగ్తో ‘నరసింహనాయుడు’గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన విజయవంతమైన చిత్రమిది. జనవరి 11 2001న విడుదలైన ‘నరసింహనాయుడు’ నేటితో 20ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలకృష్ణ నటనతో పాటు, చిన్ని కృష్ణ కథ, పరుచూరి సోదరుల సంభాషణలు, మణిశర్మ సంగీతం, బి.గోపాల్ దర్శకత్వ ప్రతిభ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.30కోట్ల వసూళ్లు రాబట్టింది.
నరసింహనాయుడు వెనుక జరిగింది ఇది
దర్శకుడు బి.గోపాల్ ఒక రోజున రచయిత పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకు వెళ్లి మూడు చిన్న చిన్న కథలు చెప్పారు. అందులో ఏది బాగుందో చెప్పమని అడిగితే, ‘పిల్లాడిని ఎత్తుకుని రైలులో నుంచి హీరో దిగుతాడు’ అన్న కథ బాగుందని అని పరుచూరి చెప్పారు. అయితే, రచయితను మిగిలిన కథ సిద్ధం చేయమని చెబుతాను అని అక్కడి నుంచి వెళ్లిపోయారు బి.గోపాల్. ఆ కథ రాసింది చిన్ని కృష్ణ అని అప్పటివరకూ పరుచూరి సోదరులకు తెలియదు. ఆ తర్వాత చిన్నికృష్ణను తీసుకుని, బి.గోపాల్ కథ చెప్పడానికి పరుచూరి సోదరుల దగ్గరకు వచ్చారు. ‘సీమ సింహం’లో పోలీస్ ఆఫీసర్ కథను ఇంకో రకంగా చిన్ని కృష్ణ చెప్పారు. బి.గోపాల్కు ప్రథమార్ధం బాగా నచ్చింది. అయితే, ‘రౌడీ ఇన్స్పెక్టర్’ కన్నా గొప్పగా లేదని, అంతకంటే మించి కథ ఉంటే చెప్పమని చిన్నికృష్ణకు బి.గోపాల్ సూచించారు. రెండు, మూడు రోజులు సమయం తీసుకుని, మళ్లీ మరో పాయింట్తో చిన్నికృష్ణ వచ్చారు. అప్పుడు ‘నేను బిహార్లో ఒక సంఘటన చూశాను. వాళ్ల గ్రామంపైకి ఎవరైనా దాడి చేస్తే, ఎదుర్కొనేందుకు ఇంటికి ఒక మగ పిల్లాడిని చొప్పున బలి పశువుగా ఇచ్చారు. అందులో ఒకడు హీరో’ అని చిన్న పాయింట్ చెప్పారు చిన్ని కృష్ణ. వెంటనే అక్కడే ఉన్న బి.గోపాల్.. ‘కథలా డెవలప్ చేసి, చెప్పకుండా ఇలా పాయింట్లా చెబితే ఎలా’ అని ప్రశ్నించారు. దీంతో పరుచూరి గోపాలకృష్ణ స్పందించి ‘అతన్ని రాయనివ్వండి. అప్పుడే అసలు కథ తెలుస్తుంది’ అని గోపాల్ను వారించారు. రెండు, మూడు రోజులు పరుచూరి సోదరులతో కలిసి కూర్చొని ‘నరసింహనాయుడు’ కథను సిద్ధం చేశారు చిన్ని కృష్ణ.
పవర్ఫుల్ డైలాగ్ వచ్చింది అప్పుడే!
కథ అంతా ఓకే అయిన తర్వాత సినిమా సెట్స్పైకి వెళ్లడం, చిత్రీకరణ పూర్తి చేసుకోవడం సజావుగా సాగిపోయింది. అయితే, రెండుసార్లు బ్రహ్మానందం అందుబాటులో లేక గుండు హనుమంతరావుతో సన్నివేశాలు తీసేశారు. షూటింగ్ చివరి రోజు ఆఖరి సన్నివేశం తీస్తుండగా, బి.గోపాల్... పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకు వచ్చి.. ‘గురువుగారు ఈ సీన్లో మంచి పవర్ఫుల్ డైలాగ్ పడితే బాగుంటుంది’ అని అంటే, అప్పటికప్పుడు ఆలోచించి ‘కత్తులతో కాదురా...కంటి చూపుతో చంపేస్తా..’ అనే డైలాగ్ సెట్లో రాశారు గోపాలకృష్ణ. థియేటర్లో ఈ డైలాగ్కు వచ్చిన స్పందన అందరికీ తెలిసిందే.
17వేల అడుగుల రష్..మారిన ఇంటర్వెల్
సినిమా చిత్రీకరణ అంతా పూర్తి కాగా, మొత్తం 17వేల అడుగుల రష్ వచ్చింది. ఎడిటింగ్ రూమ్లో సినిమాను చూసిన పరుచూరి గోపాలకృష్ణ ‘ఇది ఆంధ్రా షోలే అవుతుంది’ అన్నారు. అయితే, ద్వితీయార్ధం నిడివి పెరిగిపోయిందనడంతో, ‘ఎడిటింగ్ చేసి చూపిస్తా’ అని బి.గోపాల్ అన్నారు. మరుసటి రోజు మళ్లీ సినిమా చూడగా, ‘బి.గోపాల్.. నిన్న ఆంధ్రా షోలే అవుతుంది అన్నాను కదా! కేవలం ‘ఆంధ్రా’అనే అవుతుంది ‘షోలే’ కాలేదు’’ అంటూ గోపాలకృష్ణ చెప్పడంతో బి.గోపాల్ ఆశ్చర్యపోయారు. ‘ద్వితీయార్ధంలో ఒక్క సీన్ కూడా తీయడానికి వీల్లేదు’ అని చెప్పడంతో కొన్ని సీన్లు, అటూ ఇటూ మార్చారు.
బాలకృష్ణ రైలులో నుంచి దిగుతుండగా, రౌడీలు పారిపోతున్న సీన్ను ఇంటర్వెల్గా పెట్టారు దర్శకుడు బి.గోపాల్. ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘మా అన్నయ్యలు రానిదే పెళ్లి చేసుకోను’ అని బాలకృష్ణ చెప్పే సన్నివేశం దగ్గర ఇంటర్వెల్ వేయమని పరుచూరి సూచించారు. ‘ఇంటర్వెల్స్ ఎప్పుడూ సినిమాలను ఆడించవు.. సెకండాఫ్లు మాత్రమే ఆడిస్తాయి’ అన్న పరుచూరి మాటకు కట్టుబడి బి.గోపాల్ ఇంటర్వెల్ మార్చారు. అలా చిన్న చిన్న మార్పులతో ఇప్పుడు మనం చూస్తున్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర బృందం.
జనవరి 11, 2001న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నరసింహనాయుడు’ ప్రభంజనం సృష్టించింది. బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక మణిశర్మ అందించిన పాటలు సినిమాకు హైలైట్గా నిలిచాయి. బి.గోపాల్-బాలకృష్ణ కాంబినేషన్లో మరో ఆణిముత్యం వెండితెరపై మెరిసింది. 105 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం వారం రోజుల్లో 101 షోలను వేశారు. అప్పట్లో ఇదో రికార్డు. ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణ నంది అవార్డును అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్గుడ్ స్టోరీ.. పవన్ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!