అలా చేసినందుకే పరాజయాలు..!
‘కెరీర్ ప్రారంభంలో కథల్ని జడ్జ్ చేయడం తెలియలేదు. ఇప్పుడిప్పడే దాని నుంచి బయటపడుతున్నా’ అన్నారు నవదీప్. విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మోసగాళ్లు’ చిత్రంలో కీలక పాత్ర పోషించారాయన. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు నవదీప్.
నటుడు నవదీప్
‘కెరీర్ ప్రారంభంలో కథల్ని జడ్జ్ చేయడం తెలియలేదు. ఇప్పుడిప్పడే దాని నుంచి బయటపడుతున్నా’ అన్నారు నవదీప్. విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మోసగాళ్లు’ చిత్రంలో కీలక పాత్ర పోషించారాయన. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు నవదీప్.
సునీల్ శెట్టి మినహా..
ఈ సినిమాకు పనిచేయడం వల్ల ఇప్పటి వరకు తెలియని అంశాలెన్నో నేర్చుకున్నాను. హాలీవుడ్ నిపుణులు ఎలా పనిచేస్తారు? సన్నివేశాలు తెరకెక్కించాలంటే వాళ్లెలా ఆలోచిస్తారు? వంటివి తెలుసుకున్నాను. నాకొక కొత్త అనుభూతినిచ్చిందీ చిత్రం. సునీల్ శెట్టి పాత్ర మినహా ఈ సినిమాలోని అన్ని పాత్రలు మోసం చేసేవే. కథకు ప్రాధాన్యంగా నిలుస్తుంది నా పాత్ర. అమ్మాయిలతో తిరగడం, స్కాంలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపే పాత్ర అది. కథానాయకుడి (విష్ణు)కి ఈ విషయంలో ప్రతిభ ఉందని తెలుసుకుని అతనితో కలిసి ఓ స్కాం ప్రయత్నిస్తా. అదే సమయానికి తన సోదరి ఇచ్చిన ఐడియాలతో అందనంత ఎత్తుకు ఎదుగుతాడు అతను. దాంతో నన్ను పక్కకు పెడతారు. వాళ్ల ప్లాన్ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
తెలియని ఉత్సాహం..
విష్ణు కథ వినిపించినపుడే చాలా బాగా నచ్చేసింది. అదనంగా భారీ తారాగణం స్ర్కిప్టుపై ఆసక్తిని పెంచింది. అన్నిటికంటే ముఖ్యంగా వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం అనగానే తెలియని ఉత్సాహం వచ్చింది. గతంలో నేనూ కాజల్ పలు చిత్రాల్లో నాయకానాయికలుగా రొమాంటిక్ పాత్రల్లో కనిపించాం. ఈ సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది. ఇందులో కాజల్ ఎత్తుకు పైఎత్తు వేసే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తుంది.
కథ ఒకటే అయినా..
భారతదేశానికి చెందిన అక్కాతమ్ముళ్లు అమెరికా సాంకేతికతో ఆ దేశాన్నే మోసం చేసి భారీ ఐటీ కుంభకోణం ఎలా చేశారనేదే కథాంశం. దీన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశం ఆంగ్ల, తెలుగు భాషల్లో చిత్రీకరించాం. కథ ఒకటే అయినా అక్కడికీ ఇక్కడికీ భావోద్వేగాల్లోనే తేడా ఉంటుంది. మన ప్రేక్షకులు ఎలా ఉంటే ఇష్టపడతారో దర్శకుడికి వివరించేవాళ్లం. ఈ విషయంలో ఆయన మాకు సహకరించారు.
అదే ఫిక్స్ అయ్యాను..
కెరీర్ ప్రారంభంలో కథల్ని జడ్జ్ చేయడం తెలియలేదు. పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు స్ర్కిప్టులు తీసుకొచ్చినపుడు అవి నచ్చకపోయినా అనుభవం లేకపోవడంతో నో అని వాళ్లకి చెప్పలేకపోయాను. దాంతో చాలా పరాజయాలు ఎదురయ్యాయి. ఎక్కడ పొరపాటు జరుగుతుందో అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. లాక్డౌన్ సమయం ఇందుకు బాగా ఉపయోగపడింది. లోటుపాట్లు తెలిశాయి. మన దగ్గరకు వచ్చింది చేయడం కాదు మనకు నచ్చింది చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఇలా ఉన్నప్పుడు వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చాయి. నా కోసం రాసిన కథలు కాకపోవడంతో వాటిని తిరస్కరించాను.
నా దృష్టంతా దానిపైనే..
ప్రస్తుతం ఓ ఫాంటసీ లవ్స్టోరీకి సంతకం చేశాను. ‘బాహుబలి’ చిత్ర రచయితల్లో ఒకరైన అవనీంద్ర ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. ఇప్పటికైతే నా దృష్టంతా ఈ సినిమాపైనే పెట్టాను.నటనతోపాటు సీ స్పేస్ సంస్థ పనులు చూసుకుంటున్నా. దీని ద్వారా రచయితలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. అన్నిరకాలుగా వాళ్లకి శిక్షణ ఇచ్చి కథలు సిద్ధం చేయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్లకు స్టోరీలు అందించాం. దర్శకుడు త్రివిక్రమ్కి ఓ కథ వినిపించాం బావుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!