మంచి సినిమాలతో మీ ముందుకి వస్తా: నవీన్‌ పొలిశెట్టి

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

Published : 11 Mar 2024 14:07 IST

హైదరాబాద్‌: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty).  కె.వి. అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జాతిరత్నాలు’(Jathi Ratnalu) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. గత ఏడాది ప్రముఖ కథానాయిక అనుష్కతో కలిసి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో అలరించారు. ‘జాతిరత్నాలు’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా హీరో నవీన్‌ ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, మురళి శర్మ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2021లో విడుదలై బాక్సాఫీస్‌ హిట్‌ అందుకుంది.

‘‘జాతిరత్నాలు విడుదలై మూడు సంవత్సరాలు పూర్తయింది. కరోనా టైమ్‌లో వచ్చిన ఈ సినిమానుఆదరించారు. మంచి విజయాన్ని అందించారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇందులో ప్రతి డైలాగ్ ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. ఇలాంటి సినిమాలు చేస్తూ వినోదాన్ని అందిస్తాను. ఇకపై మీరు ఎంజాయ్ చేస్తూ, మనసారా నవ్వుకునే సినిమాలు చేస్తానని మాటిస్తున్నా. త్వరలో థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పోస్ట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని