Nayanthara: శ్రీవారి సేవలో నయనతార దంపతులు

నవ దంపతులు విఘ్నేశ్‌ శివన్‌, నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీరు శుక్రవారం తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో  పాల్గొన్నారు.

Updated : 10 Jun 2022 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవ దంపతులు విఘ్నేశ్‌ శివన్‌, నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీరు శుక్రవారం తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో  పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం వీరికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొందరు భక్తులు ఈ జంటను చూసేందుకు ఉత్సాహం చూపారు. మరికొందరు ఫొటోలు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేశ్‌ భార్యభర్తలుగా విచ్చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. మహాబలిపురంలో జరిగిన నయన్‌- విఘ్నేశ్‌ వివాహానికి రజనీకాంత్‌, షారుఖ్‌ ఖాన్‌, మణిరత్నం, బోనీ కపూర్‌ తదితర ప్రముఖుల విచ్చేసిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని