పూజాహెగ్డేకు కరోనా

సినీ ఇండస్ట్రీపై కరోనా విషపు కోరలు చాస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. తాజాగా ఆ జాబితాలోకి కథానాయిక పూజాహెగ్డే పేరు చేరింది...

Updated : 26 Apr 2021 11:28 IST

హైదరాబాద్‌: సినీ ఇండస్ట్రీపై కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వైరస్‌ బారిన పడగా.. తాజాగా ఆ జాబితాలో కథానాయిక పూజాహెగ్డే పేరు చేరింది. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉంటున్న పూజాహెగ్డేకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టు పెట్టారు.

‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రస్తుతం నేను హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాను. ఈ మధ్యకాలంలో నన్ను కలిసిన వారందరూ దయచేసి టెస్టులు చేయించుకోండి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. దయచేసి అందరూ ఇంట్లో ఉండండి. జాగ్రత్తగా ఉండండి’ అని పూజా పేర్కొన్నారు. ఇక పూజా చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’, ‘సర్కస్‌’, ‘విజయ్‌ 65’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని