Radhe Shyam: రాధేశ్యామ్ అప్‌డేట్‌.. పూజా హెగ్డే డబ్బింగ్‌ పూర్తి..

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నటి పూజా హెగ్డే కలయికలో వస్తున్న వింటేజ్‌ ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. చాలా ఏళ్ల తరువాత ప్రభాస్‌ రొమాంటిక్‌ కథ చిత్రంలో నటించడంతో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. 

Published : 04 Dec 2021 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నటి పూజా హెగ్డే కలయికలో వస్తున్న వింటేజ్‌ ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. చాలా ఏళ్ల తరువాత ప్రభాస్‌ రొమాంటిక్‌ కథ చిత్రంలో నటించడంతో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ట్విటర్‌ వేదికగా వెల్లడించి రాధ్యేశ్యామ్‌ టీమ్‌. ‘‘ విడుదలకు కేవలం ఒక స్టెప్‌ దూరంలో ఉన్నాం. ‘ప్రేరణ’ పాత్రకు పూజ హెగ్డే డబ్బింగ్‌ చెప్పడం పూర్తైంది. థియేటర్లలో కలుద్దాం’’ అంటూ పూజా డబ్బింగ్‌ స్టూడియోలో డబ్బింగ్‌ చెబుతున్న చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.350కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన రాధేశ్యామ్‌  తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని