Bigg Boss Telugu7: బిగ్‌బాస్‌ నుంచి పూజా మూర్తి ఎలిమినేట్‌

bigg boss 7 telugu: బిగ్‌ బాస్‌ 7 సీజన్‌ నుంచి పూజామూర్తి ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు.

Published : 23 Oct 2023 01:51 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి పూజా మూర్తి (pooja murthy) ఎలిమినేట్‌ అయ్యారు. ‘ఉల్టా పల్టా’ అంటూ మొదలైన ఈ సీజన్‌లో ఇప్పటివరకూ అందరూ మహిళా కంటెస్టెంట్‌లే ఎలిమినేట్‌ కాగా, ఇప్పుడు పూజా మూర్తి వంతు వచ్చింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారిలో భోలో షావలి, అశ్విని, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్‌, పూజా మూర్తి, అమర్‌దీప్‌, గౌతమ్‌లు ఉండగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన పూజా హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. ఇతర ఇంటి సభ్యులతో పోలిస్తే, పూజా మూర్తి ఎంట్రీ కాస్త డిఫరెంట్‌.

సీజన్‌-7 (Bigg Boss Telugu7) మొదలైనప్పుడే ఆమె హౌస్‌లోకి అడుగు పెట్టాల్సి ఉంది. అయితే, షో ప్రారంభమయ్యే ముందు పూజా తండ్రి చనిపోవడంతో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో రెండు వారాలకే ఎలిమినేట్‌ అయ్యారు. ఇక ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. పాయల్ రాజ్‌పుత్‌, డింపుల్‌ హయాతీ, రెబ్బ మోనికా తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని