Tollywood: షూటింగ్స్‌ బంద్‌.. మరోసారి చర్చిస్తాం : సి. కల్యాణ్‌

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారం ఆగస్టు మొదటి వారంలో లభిస్తుందని తెలిపారు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌.

Published : 28 Jul 2022 02:02 IST

హైదరాబాద్‌: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారం ఆగస్టు మొదటి వారంలో లభిస్తుందని తెలిపారు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌ (C Kalyan). చిత్రీకరణలు నిలిపివేయాలనే ‘ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌’ నిర్ణయంపై ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మూడు అంశాలపై చర్చలు సాగాయని, ఈ నెల 30న మరోసారి భేటీ అవుతామని వివరించారు. షూటింగ్స్‌ గురించి ఈ నెల 31న నిర్వహించనున్న జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆగస్టు 1 నుంచి చిత్రీకరణలు నిలివేయాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పలువురు నిర్మాతలు ఓ ప్రత్యేక కమిటీతో ఫిల్మ్‌ ఛాంబర్‌లో సమావేశమై, చర్చించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని