Radhika: జయలలిత ఏదీ మర్చిపోరు.. చివరి వరకూ నన్ను సీరియస్గానే చూశారు: రాధిక
గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం విత్ స్మిత’ (Nijam With Smita) టాక్ షోలో తాజాగా నటి రాధిక, నిర్మాత స్వప్నాదత్, సుప్రియ సందడి చేశారు. తమ కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్డెస్క్: స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ (Nijam With smita) కార్యక్రమంలో నటి రాధికా శరత్కుమార్ (radhika) సందడి చేశారు. సుప్రియ, స్వప్నదత్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినదానిపై మాట్లాడారు. అలాగే, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇప్పటివరకూ జీవితంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. జీవితం ఒక ప్రయాణం. ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలని తెలుసుకున్నాను. ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుని ఎక్కువగా ఆలోచించడం మానేశాను. అనుకోకుండా నటి అయ్యాను. నేను చేసిన మొదటి తెలుగు సినిమా ‘న్యాయం కావాలి’. ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు తెలుగు రాదు. శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాను. నేర్చుకున్న ప్రతి విషయాన్ని చక్కగా పాటిస్తే తప్పకుండా విజయం దక్కుతుందని తెలుసుకున్నా. రాజకీయ నాయకురాలు కావాలని అనుకోలేదు. అది కూడా అనుకోకుండా జరిగిపోయింది. అప్పట్లో డీఎంకే అగ్రనేత కరుణానిధి కుటుంబంతో నాకు సత్సంబంధాలు ఉండేవి. ఓసారి ఆయన నన్ను కలిసి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (Jayalalitha)కు వ్యతిరేకంగా ప్రచారం చేయమన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత నుంచి చివరి వరకూ నన్ను కలిసిన ప్రతిసారీ జయ ఒక సీరియస్ లుక్ పెట్టి.. ‘ఏంటమ్మా ఎలా ఉన్నావు?’ అని అడిగేవారు. రాజకీయపరంగా నా భర్త శరత్కుమార్తో మైత్రి కలిగి ఉన్నప్పటికీ ఆమె నన్ను సీరియస్గానే చూసేవారు. ఆమెతో అంత ఈజీ కాదు. ఆమె ఏదీ మర్చిపోరు’’ అంటూ రాధిక (Radhika) నవ్వులు పూయించారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సుప్రియ (Supriya) తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను కావాలని ఇండస్ట్రీలోకి రాలేదు. తాతయ్య, చిన్నమామయ్యలను చూసి 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. నా మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. హీరోయిన్కు ఉండే కష్టాలు అప్పుడే తెలిశాయి. ‘ఇది నేను చేయలేను’ అంటూ మూడో రోజే సెట్ నుంచి పారిపోయా. దర్శకుడు ఇవీవీ సత్యనారాయణ వచ్చి.. ‘ఏంటమ్మా ఇలా ఉన్నావు. కాస్త మేకప్.. ముదురు రంగు దుస్తులు వేసుకోని రా’ అని చెప్పేవారు. రెండో షెడ్యూల్కే నాలుగుసార్లు సెట్ నుంచి పారిపోయా. అప్పుడు కల్యాణ్ (pawan kalyan) నా వద్దకు వచ్చి.. ‘‘నువ్వు ఈ సినిమాని ఎలాగైనా పూర్తి చెయ్. సినిమా అయ్యాక నీ ఇష్టం’’ అని చెప్పాడు. అలా, ఆ సినిమా పూర్తి చేశా. అది చేస్తోన్న సమయంలోనే మరో మూడు సినిమాలకు హీరోయిన్గా అడ్వాన్స్ తీసుకున్నా. కష్టపడి అన్నింటినీ పూర్తి చేశా. స్టూడియో చూసుకోవడం తప్ప ప్రతీది నేను ఒక ఆటగానే చూశా’’ అని వివరించారు.
అనంతరం, నిర్మాత స్వప్నదత్ (Swapna Dutt) తన కెరీర్ గురించి మాట్లాడారు. ‘‘టీవీ ఛానెల్ పెట్టినప్పుడు నేను ఎన్నో పరాజయాలను చూశాను. దాని వల్ల 28 ఏళ్ల వయసులోనే కెరీర్ పరంగా పెద్ద దెబ్బ తగిలింది. కష్టపడ్డాను. సక్సెస్ అందుకుని ఈ స్థాయికి వచ్చాను’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఈటీవీ విన్’లో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాయల్ రాజ్పుత్, సిమ్రత్ కౌర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాయా పేటిక’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. -
ఓటీటీలోకి ‘షరతులు వర్తిస్తాయి!’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘షరతులు వర్తిస్తాయి!’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
‘విద్యా వాసుల అహం’ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘విద్యా వాసుల అహం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడంటే? -
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘జర హట్కే జర బచ్కే’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ప్రత్యేక సందేశమిచ్చారు. -
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. -
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి. -
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
నేరుగా ఓటీటీలోకి వరుణ్ సందేష్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ సందేష్ నటించని క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర’ నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
త్రిగుణ్ కీలక పాత్రలో నటించిన ‘లైన్ మ్యాన్’ మూవీ ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కొత్తదనం నిండిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. -
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
తండేల్ మూవీ ఓటీటీ డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365