Keerthy Suresh: రానుంది వినోదాల సుడిగాలి

వేర్వేరు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది కీర్తి సురేశ్‌. గత ఏడాది తమిళంలో ‘మామన్నన్‌’, తెలుగులో ‘భోళా శంకర్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె ఇప్పుడు నాయికా ప్రాధాన్య చిత్రం ‘రఘుతాత’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

Updated : 03 Jan 2024 11:51 IST

వేర్వేరు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది కీర్తి సురేశ్‌. గత ఏడాది తమిళంలో ‘మామన్నన్‌’, తెలుగులో ‘భోళా శంకర్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె ఇప్పుడు నాయికా ప్రాధాన్య చిత్రం ‘రఘుతాత’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ తమిళంలో తొలిసారి నిర్మిస్తున్న ఈ సినిమాతో సుమన్‌ కుమార్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మంగళవారం ఈ చిత్ర కొత్త ప్రోమోను విడుదల చేశారు. ఈ సంక్షిప్త వీడియోలో ఒక బ్లాక్‌బోర్డుపై పైన ‘హిందీ వర్డ్‌ ఆఫ్‌ ది డే’.. కింద ‘పరీక్ష’ అని రాసి ఉంటుంది. అది చూసిన ఓ మహిళ కోపంగా వెళ్లి దాన్ని చెరిపేయడం ఆ ప్రోమోలో చూపించారు. ఈ వీడియోని ఎక్స్‌లో పంచుకుంటూ ‘వినోదాల సుడిగాలి మీ దగ్గర్లోని థియేటర్లను తాకడానికి రానుంది. ‘రఘుతాత’తో ఆ నవ్వుల్లో తేలిపోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ కీర్తి సురేశ్‌ వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు