Rashmika: అది ప్రేక్షకుల అభిప్రాయం.. నేను దాన్ని పట్టించుకోను: రష్మిక

‘యానిమల్‌’లో హింసాత్మక సన్నివేశాలపై రష్మిక తాజాగా మాట్లాడారు.

Published : 05 Feb 2024 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’లో గీతాంజలిగా తన నటనతో ఆకట్టుకున్నారు నటి రష్మిక. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఇందులోని హింసాత్మక సన్నివేశాలపై స్పందించారు.

‘నటీనటులు వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. సినిమాను ఆదరించాలా.. లేదా అనేది ప్రేక్షకుల స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది. ఇందులో రణ్‌బీర్ పాత్ర.. భార్యకు, కుటుంబానికి ఎంతో గౌరవాన్నిస్తుంది. తన వాళ్లను కాపాడుకోవడానికి ఎంత సాహసమైనా చేసేందుకు సిద్ధమవుతుంది. ఆడియన్స్‌కు ఆ పాత్ర కచ్చితంగా నచ్చాలనే నిబంధన లేదు. అది పూర్తిగా ఆడియన్స్ అభిరుచి. ఆ విషయం నేను పట్టించుకోను. ఈ సినిమాను ఎంతోమంది ఆదరించారు. చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

‘హనుమాన్‌’ కోసం 70 ప్రాజెక్ట్‌లు వదులుకున్నా..: తేజ సజ్జా

తన పాత్ర గురించి మాట్లాడుతూ..‘‘నేను దర్శకుడి ఊహకు ప్రాణంపోయాలనుకునే నటిని. ఆయన చెప్పినట్లు చేయడం నా కర్తవ్యం. సన్నివేశం బాగా వచ్చే వరకు ఎన్ని టేక్‌లైనా చేస్తాను. గీతాంజలి చాలా ధైర్యవంతురాలు. నిజ జీవితంలో కూడా జీవించేవారు అనేకమంది నాకు తెలుసు. వాళ్లకోసం ఈ పాత్రను స్వేచ్ఛతో చేశాను’’అని చెప్పారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప2’లో నటిస్తున్నారు. ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు మరో మూడు ప్రాజెక్ట్‌ల్లో చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని