RGV: చిరు-పూరీ కాంబోపై వర్మ ఏమన్నారంటే

మెగాస్టార్‌ చిరంజీవి - పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌పై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ స్పందించారు. వీరిద్దరి కాంబినేషన్‌ గురించి తన మనసులోని మాటను బయటపెడుతూ తాజాగా ట్వీట్‌ చేశారు. 

Updated : 13 Oct 2022 12:28 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు జరిగినప్పటికీ సఫలీకృతం కాలేదు. కాగా, బుధవారం విడుదలైన ఇంటర్వ్యూ తర్వాత పూరీ - చిరు కాంబో మరోసారి వార్తల్లో నిలిచింది. దీనిపై తాజాగా వర్మ స్పందించారు. చిరు-పూరీ ఇంటర్వ్యూ వీడియోని షేర్‌ చేసిన వర్మ.. ‘‘సినిమా అంటే ప్రేమ కనబరిచే ఇద్దరు వ్యక్తుల నిజమైన కాంబినేషన్‌ ఇది. వీళ్లిద్దరిని ఇలా చూస్తుంటే అద్భుతంగా ఉంది. వీళ్లిద్దరి కాంబో కోసం నేను ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నారు.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather)తో విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూరీ జగన్నాథ్‌ ‘గోవర్ధన్‌’ అనే విలేకరిగా కనిపించారు. ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. ఇందులో చిరంజీవిని పూరీ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ క్రమంలోనే చిరు.. ‘ఆటోజానీ’ని ఏం చేశావు? అని ప్రశ్నించగా.. ‘‘అది పాత కథ. మీ కోసం ఇప్పుడు అంతకంటే మంచి కథ రాస్తా. త్వరలోనే మిమ్మల్ని కలిసి వినిపిస్తా’’ అని బదులిచ్చాడు. దీంతో పూరీ-చిరు కాంబో మరోసారి వార్తల్లోకి వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని