Roja: ‘చాలా బాధగా ఉంది’.. ‘జబర్దస్త్‌’ వేదికపై రోజా కంటతడి!

సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయం అందుకున్న వారిలో రోజా ఒకరు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలు, పలు టెలివిజన్‌ కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఎమ్మెల్యేగా రెండు సార్లు  గెలిచిన సంగతి తెలిసిందే.

Published : 15 Apr 2022 10:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి రాణిస్తోన్న వారిలో రోజా ఒకరు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలు, పలు టెలివిజన్‌ కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో అడుగుపెట్టాక ఒకటి రెండు చిత్రాలు మినహా వెండితెరకు దాదాపు దూరమయ్యారు. కానీ, బుల్లితెర వేదికగా పలు వినోదాత్మక కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి వినోదం పంచారు. కొన్ని కార్యక్రమాల ద్వారా చైతన్యం నింపారు. వీటిల్లో ఆమెకు బాగా పేరు తీసుకొచ్చిన షోలు ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. నవ్వులు పూయించే ఈ కార్యక్రమాలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

అయితే, ఇటీవల ఆమె ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వీటికి దూరంకానున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల ‘జబర్దస్త్‌’ ప్రయాణాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నేను ఇక్కడున్నప్పుడే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యా. ఇక్కడే మంత్రినీ కావాలనుకున్నా. ప్రజా సేవ చేయడం నాకిష్టం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మంచి స్థాయిని నాకిచ్చినప్పుడు ఇలాంటివి కొన్నింటిని వదులుకోవాల్సి వస్తుంది. ఇది కష్టమే కానీ తప్పదు. మీ అందరినీ మిస్‌ అవుతాననే బాధ ఉంది’’ అంటూ ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ వేదికపై రోజా కంటతడి పెట్టుకున్నారు. ‘ఈటీవీ’కి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని