ఈ మహాయుద్ధంలో మనం గెలవాలంటే..

‘కరోనాని తరిమికొట్టేందుకు ప్రజలంతా మాస్క్‌ ధరించాలని, క్రమం తప్పకుండా సానిటైజ్‌ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని’ కోరారు నటుడు సాయి కుమార్‌.

Published : 28 Apr 2021 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కరోనాని తరిమికొట్టేందుకు ప్రజలంతా మాస్క్‌ ధరించాలని, క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని’ కోరారు నటుడు సాయి కుమార్‌. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులతో కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ముందుకొచ్చారాయన. కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు ఏవేం చేయాలో తనదైన శైలిలో తెలియజేశారు. సంబంధిత వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ.

‘ఈ రోజు మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచమంతా ఓ సవాలు ఎదుర్కొంటోంది. అదే కరోనా. కరోనాని కట్టడి చేయడం మన తక్షణ కర్తవ్యం. అందుకే ఈ విన్నపం. ఆలకించండి.. ఆలోచించండి.. ఆచరించండి. కనిపించే శత్రువుతో చేసేది యుద్ధం. కనిపించని కరోనా వైరస్‌తో చేసేది మహా యుద్ధం. ఇందులో మనం గెలవాలంటే, కరోనా వైరస్‌ పారిపోవాలంటే, మన పంచ ప్రాణాలని కాపాడుకోవాలంటే ఈ పంచ సూత్రాల్ని మనం పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు సాయి కుమార్‌. మరి ఆ నియమాలేంటో వీడియో చూసి తెలుసుకోండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని