Sailesh Kolanu: వారి పోరాటానికి బలమైన గొంతుక ‘సైంధవ్’
‘‘జయాపజయాల్ని పట్టించుకోకుండా ప్రయాణాన్ని ఆస్వాదించే మనస్తత్వం నాది. నిజాయితీగా సినిమా తీస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్ముతా. ‘సైంధవ్’ను అదే అభిరుచితో చేశా’’ అన్నారు శైలేశ్ కొలను.
‘‘జయాపజయాల్ని పట్టించుకోకుండా ప్రయాణాన్ని ఆస్వాదించే మనస్తత్వం నాది. నిజాయితీగా సినిమా తీస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్ముతా. ‘సైంధవ్’ను అదే అభిరుచితో చేశా’’ అన్నారు శైలేశ్ కొలను. ‘హిట్’ సిరీస్ విజయాల తర్వాత ఆయన దర్శకత్వం నుంచి వస్తున్న కొత్త చిత్రమే ‘సైంధవ్’. ఇది హీరో వెంకటేశ్కు 75వ సినిమా. ఈ నెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శైలేశ్.
‘‘హిట్ 2’ విడుదలయ్యాక నిర్మాత వెంకట్ సలహా మేరకు వెంకటేశ్ను కలిశా. అప్పుడాయన నన్నెంతో అభినందించారు. మరో రెండు మూడూ మీటింగ్స్ తర్వాత మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అప్పుడే ఇద్దరం కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడే ‘సైంధవ్’ స్క్రిప్ట్ ఆయనకు వినిపించా. వెంటనే తను ‘ఇది నా 75వ సినిమా అనిపిస్తోంది’ అన్నారు. ఆ తర్వాత దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్గా డెవలప్ చేసి వినిపించా. వెంకీ అదంతా విని.. నాకు ఓ హగ్ ఇచ్చి.. ‘ఇది మనం చేస్తున్నాం’ అన్నారు. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది’’.
భావోద్వేగాలు నిండిన కథతో..
‘‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారి పోరాటానికి బలమైన గొంతుకగా నిలుస్తుంది ఈ చిత్రం. ఆ వ్యాధిని నయం చేసే రూ.17కోట్ల ఇంజక్షన్ కోసం తపన పడే తల్లిదండ్రుల గురించి.. వారి పోరాటం గురించి మనకు పెద్ద అవగాహన లేదు. ఈ విషయాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలంటే వెంకటేశ్ వంటి స్టార్లు కావాలి. అందుకే ఈ కథను ఆయన ద్వారా చెప్పించాం. ఇంతటి భావోద్వేగాలు నిండిన కథను నేనింత వరకు చేయలేదు. ఇది చాలా ఆర్గానిక్గా రాసిన కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది. లార్జర్ దేన్ లైఫ్ అంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’.
‘‘నా దగ్గర ఒక మంచి ప్రేమకథ ఉంది. నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని తీసుకొని దాన్ని రాశాను. తప్పకుండా దీన్ని సినిమాగా మలుస్తా. నాని ‘హిట్ 3’ చిత్ర స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏడాదిన్నర సమయం పట్టొచ్చు’’.
ఆద్యంతం ఉత్కంఠభరితం..
‘‘ఈ కథ దాదాపుగా 70శాతం రాత్రి పూటే నడుస్తుంది. మొదట.. వెంకటేశ్.. ఆయన కూతురు.. శ్రద్ధా శ్రీనాథ్.. విలన్.. ఇలా ప్రధాన పాత్రలు ఆసక్తికరంగా పరిచయమవుతాయి. 15నిమిషాల తర్వాత నుంచి ప్రేక్షకులు ఇక తల తిప్పుకోలేరు. అంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. డ్రగ్స్, గన్ బిజినెస్.. ఈ కథలో భారీ ఎత్తున జరుగుతుంటాయి. ఇదంతా సముద్ర తీరంలో జరగాలి. వైజాగ్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా ఉండదు. అందుకే ఈ కథ కోసం ‘చంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ను సిద్ధం చేశాం. ఇది విజయవంతమైతే ‘సైంధవ్ 2’ చేస్తాం. ఎందకంటే ఈ కథకు ఆ అవకాశం ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rashi Singh: అందాల రాశి
ఇటీవల ఓ సినిమాతో సందడి చేసిన రాశీసింగ్ ఇప్పుడు ‘ప్రసన్నవదనం’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విశేషాలు..
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్సిరీస్ మెప్పించిందా? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..