Samantha: చర్చనీయాంశంగా సమంత ట్వీట్‌!

తరచూ ఆసక్తికర ఫొటోలు, సరదా వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరించే సమంత తాజాగా పెట్టిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. మౌనం, దయ.. తదితర అంశాలపై బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామ రాసిన కోట్‌ను చెప్పడం ఇందుకు కారణమైంది.

Published : 23 Apr 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తరచూ ఆసక్తికర ఫొటోలు, సరదా వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరించే సమంత తాజాగా పెట్టిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. మౌనం, దయ.. తదితర అంశాలపై బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామ రాసిన కోట్‌ను చెప్పడం ఇందుకు కారణమైంది. ‘‘నేను మౌనంగా ఉన్నానంటే పట్టించుకోవడంలేదని, ఏమీ మాట్లాడటం లేదూ తప్పు అంగీకరించానని, నా దయా హృదయాన్ని బలహీనత అని మీరు పొరపడొద్దు. దయకూ ఓ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది’’ అనే మాటలతో సమంత ట్వీట్‌ చేసింది. దాంతో ఎవరిని ఉద్దేశించి ఆమె అలా ట్వీట్‌ పెట్టింది? అసలు ఏం జరిగింది? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ‘ఓ నెటిజన్‌ ట్రోల్‌ వల్ల ఇలా చేసింది’ అని కొందరు, ‘ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఇలా పెట్టింది’ అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. నయనతార, విజయ్‌ సేతుపతితో కలిసి సమంత నటించిన ‘కాతువాకుల రెండు కాదల్‌’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. హరి శంకర్‌- హరీశ్‌ నారాయణ్‌ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘యశోద’ ఆగస్టు 12న రిలీజ్‌కానుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఆమె నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. వీటితోపాటు అంతర్జాతీయ ప్రాజెక్టులను ఖరారు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని