Sekhar Master: చిరంజీవి, బాలకృష్ణలో ఉన్న కామన్ పాయింట్ అదే: శేఖర్ మాస్టర్
కొరియోగ్రాఫర్ శేఖర్ ఇంటర్వ్యూ. చిరంజీవి, బాలకృష్ణ గురించి ఆయన పలు విశేషాలు పంచుకున్నారు.
హైదరాబాద్: చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాలు 2023 సంక్రాంతి బరిలో దిగనున్నాయి. జనవరి 12న బాలయ్య సినిమా, 13న చిరు చిత్రం విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ఈ రెండు సినిమాలకు పనిచేసిన కొరియోగ్రాఫర్ శేఖర్ (Sekhar Master) తన అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. ఆ వివరాలివీ..
* చిరంజీవి, బాలకృష్ణలతో పని చేయడం ఎలా అనిపించింది?
శేఖర్: ఈ ఇద్దరి (Chiranjeevi) (Balakrishna) సినిమాలు సంక్రాంతికి విడుదలవుతాయనే సంగతి వాటికి పనిచేస్తున్నపుడు నాకు తెలియదు. అందుకే ఎలాంటి ఒత్తిడిలేకుండా స్టెప్పులు కంపోజ్ చేశా. ఇప్పుడు రెండు చిత్రాల్లోని పాటలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుండటంతో టెన్షన్ పడుతున్నా (నవ్వుతూ..). మరోవైపు ఆనందంగా ఉంది.
* ఏ సినిమాలో ఎన్ని పాటలకు నృత్య రీతులు సమకూర్చారు?
శేఖర్: ‘వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలు, ‘వీరసింహారెడ్డి’లో రెండు పాటల(సుగుణ సుందరి, మా బావ మనోభావాలు)ను కంపోజ్ చేశా. నాకు 2023 సంక్రాంతి చాలా స్పెషల్. నాతోపాటు ప్రేక్షకులంతా ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
* చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి?
శేఖర్: ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ డెడికేషన్. ఓ మూమెంట్ చెబితే అది సరిగ్గా వచ్చేంత వరకూ విశ్రాంతి తీసుకోరు. ‘ఇలాంటి స్టెప్పులే కావాలి’ అని వారు అడగరు. ఏదైనా కొత్తగా చేయమని ప్రోత్సహించేవారు. సమయపాలన విషయంలోనూ ఇద్దరూ ఒకటే. అగ్ర హీరోలతో పనిచేయడం కంఫర్ట్గానే ఉంటుంది. అంచనాలు ఉన్నా దానికి తగ్గట్టు పనిచేస్తా.
* మెలొడీకి డ్యాన్స్ కంపోజ్ చేయడం సవాలా?
శేఖర్: అవును. ‘వాల్తేరు వీరయ్య’లోని ఓ మెలొడీని చిత్రీకరించేందుకు ఫారిన్ వెళ్లాం. ‘వీరసింహారెడ్డి’లోని సుగుణ సుందరి పాట కోసం టర్కీ వెళ్లాం. ఓ చోట బాగా చలి పెడితే మరో చోట ఎండలు మండిపోయేవి. సమస్యలను లెక్కచేయకుండా హీరోహీరోయిన్లు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.
* ఈ తరం డ్యాన్స్ మాస్టర్లు సిగ్నేచర్ స్టెప్స్పై ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తోంది. దానిపై మీ అభిప్రాయం?
శేఖర్: ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. రీల్స్ను చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. అందులో కనిపించే ఒక్క మూమెంట్ నచ్చితే చాలు.. పూర్తి సాంగ్ ఎలా ఉంటుందోనన్న సంగతి తర్వాత. దాంతో సిగ్నేచర్ స్టెప్పు బాగుంటే ఆ పాట ప్రేక్షకులకు దగ్గరవుతుంది. సిగ్నేచర్ స్టెప్పు కచ్చితంగా ఉండాల్సిందే.
* కొరియోగ్రఫీ విషయంలో బీట్కు ప్రాధాన్యం ఇస్తారా, సాహిత్యానికా?
శేఖర్: అధిక శాతం బీట్కే ఉంటుంది. ఒకవేళ లిరిక్స్ బీట్ను డామినేట్ చేస్తుంటే రెండిటినీ పరిగణలోకి తీసుకుంటాం.
* ‘శేఖర్తో పనిచేయాలని ఉంది’ అని అగ్ర హీరోలు అనడంపై మీ స్పందన?
శేఖర్: చాలా సంతోషంగా ఉంటుంది. దాన్ని గాడ్ గిఫ్ట్గా భావిస్తా. నటన, దర్శకత్వంపై ప్రస్తుతానికి ఆసక్తిలేదు. నా దృష్టంతా కొరియోగ్రఫీ పైనే.
* కొరియోగ్రఫీ చేసేముందు మీరెలా సన్నద్ధమవుతారు?
శేఖర్: ముందుగా పాట బీట్ ఎలా ఉందో చూస్తా. ఆ తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్కు ఎలాంటి స్టెప్పులు మ్యాచ్ అవుతాయో ఊహించుకుంటా. దానికి తగ్గట్టు ముందుకెళ్తా. కొన్నిసార్లు లొకేషన్లకు అనుగుణంగా చేయాల్సి వస్తుంది.
* ప్రస్తుతం ఏయే సినిమాలకు పనిచేస్తున్నారు?
శేఖర్: మహేశ్బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఓ చిత్రం, రవితేజ ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలకు పనిచేస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు