నటీమణుల కష్టాలను కళ్లారా చూశా: సునీత

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో మధురమైన పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు ప్రముఖ గాయని సునీత. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని ఇటీవల వివాహం చేసుకున్న సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు....

Updated : 24 Jan 2021 14:55 IST

ప్రస్తుతం నా జీవితం బాగుంది అంటోన్న గాయని

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో మధురమైన పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు ప్రముఖ గాయని సునీత. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని ఇటీవల వివాహం చేసుకున్న సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన కెరీర్‌, వివాహానంతర జీవితం గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఒక నటికి కావాల్సిన లక్షణాలన్నీ సునీతలో ఉన్నాయని.. కాబట్టి అభిమానులు ఆమెను వెండితెరపై చూడాలనుకుంటున్నారని విలేకరి అన్నారు.

సదరు వ్యాఖ్యలపై స్పందించిన సునీత.. ‘‘గులాబి’లోని ‘ఈ వేళలో నీవు’ పాట నాకెంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాట తర్వాత తెలుగులో నాకు కొన్ని సినిమా ఆఫర్స్‌ వచ్చాయి. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘అనగనగా ఒక రోజు’లో అవకాశమిచ్చారు. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి గారు కూడా నా కెరీర్‌ ప్రారంభంలో అవకాశాలిచ్చారు. కానీ, నాకు నటన పట్ల ఆసక్తి లేదు. అందుకే నాకు వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించా. సినీ పరిశ్రమలోని ఎంతో మంది హీరోయిన్స్‌ పడిన కష్టాలను నా కళ్లారా చూశాను. వాళ్లకు ఎదురైన పరిస్థితుల్లో నా జీవితాన్ని ఊహించుకుంటే నాకెంతో భయవేసింది. అందుకే, నటనను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రస్తుతానికి నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. దానిని అలాగే ఉంచాలనుకుంటున్నా’ అని సునీత తెలిపారు.

ఇవీ చదవండి..

నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌

వేదికపై కుప్పకూలిన డైరెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని