Guntur Kaaram: సితార మంచి మనసు.. వారి కోసం ‘గుంటూరుకారం’ స్పెషల్‌ షో

సితార (Sitara) తన మంచి మనసు చాటుకున్నారు. ‘గుంటూరుకారం’ స్పెషల్‌ షో ఏర్పాటు చేశారు. 

Published : 21 Jan 2024 15:10 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) కుమార్తె సితార (Sitara) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అనాథ చిన్నారుల కోసం ‘గుంటూరుకారం’ (Guntur Kaaram) ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మహేశ్‌బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏఎంబీ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు సితార హాజరయ్యారు. చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారితో ఫొటోలు దిగారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సితార మంచి తనాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

HanuMan: అయోధ్య రామ మందిరం.. ‘హను-మాన్‌’ విరాళం ఎన్ని కోట్లంటే..?

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ - మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల (Sreeleela) కథానాయిక. మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మహేశ్‌ నటన, శ్రీలీల డ్యాన్స్‌కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని