Social Look: రకుల్‌ప్రీత్‌ ‘భూమి’ సందేశం.. తమన్నా ‘వడాపావ్‌’ సమాచారం!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 23 Apr 2022 01:37 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* నేడు.. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అభిమానులకు సందేశానిచ్చింది. ‘‘మనమంతా కలిసుండే ఒకే ఒక్క ఇల్లు.. భూమి. ముందు తరాలకు అందించాల్సిన ఈ ఇంటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. చిన్న మార్పైనా పెద్ద ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొంది.

* దర్శకుడు మధుర్‌ బండార్కర్‌తో కలిసి వడాపావ్‌ తింటూ కనిపించింది తమన్నా. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘బబ్లీ బౌన్సర్‌’ సినిమా చిత్రీకరణ ఆఖరి షెడ్యూల్‌లో ఉందనే సమాచారం ఇచ్చింది.

* ఫాతిమా సనా తన స్టిల్స్‌ను షేర్‌ చేసింది. ‘హ్యాండ్సప్‌’ అనే క్యాప్షన్‌ పెట్టింది.

* వేసవిలో తెలుపు రంగు దుస్తులనే ఇష్టపడతా అని తెలిపింది హ్యుమా ఖురేషి. ఇలా మరికొందరు తారలు పంచుకున్న సంగతులపై ఓ లుక్కేయండి..





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని