SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
SS Karthikeya on RRR Oscar: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్ కోసం భారీగా ఖర్చు చేశారని వచ్చిన వార్తలపై సినిమా లైన్ ప్రొడ్యూసర్, రాజమౌళి తనయుడు కార్తికేయ స్పష్టతనిచ్చారు.
హైదరాబాద్: ‘RRR’లో ‘నాటు నాటు...’ (Naatu Naatu) తెలుగు పాటకు ఫిదా అయి, ఆస్కార్ నడిచి వచ్చిన వేళ కొందరు పనిగట్టుకుని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అవార్డు కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని, కొన్నారని ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ‘RRR’ లైన్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్.కార్తికేయ (SS Karthikeya) స్పష్టతనిచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమను కొనలేమని, సినిమాను వాళ్లే పైస్థాయిలో నిలబెట్టారని అన్నారు.
‘‘వివిధ భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఘన విజయం సాధించిన తర్వాత అమెరికా (ఇంగ్లీష్ వెర్షన్)లో జూన్ 1న విడుదల చేయాలని నిర్ణయించాం. థియేటర్ల వివరాలు సేకరించి ఒక్క రోజు కోసం 60 స్క్రీన్లపై ప్రదర్శిద్దామనుకున్నాం. అప్పటికి ఐదు రోజుల ముందే మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ మొదలైంది. ఒకరోజు అనుకుని సినిమా విడుదల చేస్తే, అలా నెల గడిచిపోయింది. నాన్ - ఇండియన్స్ సినిమాను బాగా ఆదరించారు. సాధారణంగా ఇండియన్ సినిమాలంటే పాటలు, డ్యాన్స్లు ఉంటాయని హాలీవుడ్ ప్రేక్షకులు ఆలోచిస్తుంటారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’లో పాటలతో పాటు, అద్భుతమైన హీరోయిజం కూడా ఉంది. ‘సినిమాలో మీకు ఏం నచ్చింది’ అని స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది అభిప్రాయాలు అడిగేవాళ్లం. ‘చరణ్ను తారక్ అన్న ఎత్తుకుని ఫైట్ చేసే సీన్ బాగా నచ్చింది’ అని చెప్పేవాళ్లు. అప్పుడే #rrrforoscars ట్రెండ్ మొదలైంది. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఆస్కార్కు పంపాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. ‘ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా’ అని మాకు అనిపించింది’’ అని కార్తికేయ చెప్పారు.
ఎవరైనా టికెట్ కొనాల్సిందే!
‘‘ఆర్ఆర్ఆర్’కు భారతదేశం నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లభించనప్పుడు కాస్త బాధ అనిపించింది. సినిమా పంపి ఉంటే ఇంకాస్త బలంగా ఉండేది. ‘ఆస్కార్ కోసం క్యాంపెయిన్ చేసినప్పుడు అనేక వార్తలు వచ్చాయి. బోలెడంత డబ్బు ఖర్చు చేశారని, ఆస్కార్ టీమ్ను కొనేశారని, ఆస్కార్ టికెట్ల కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టారని’ వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ (NTR), రామ్చరణ్ (Ram Charan), ప్రేమ్రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు ఆస్కార్ కమిటీ ఆహ్వానితులు. కీరవాణి బాబాయ్, చంద్రబోస్లు నామినేషన్లో ఉన్నారు’’
‘‘కమిటీ పిలిచిన వాళ్లు, నామినేషన్స్లో వాళ్లు తప్పితే, ప్రతి సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందాలు టికెట్ కొనాల్సిందే. ఇందుకోసం నామినేషన్స్లో ఉన్నవాళ్లు ఆస్కార్ కమిటీకి మెయిల్ చేయాలి. ఆ టికెట్లలో కూడా వివిధ రకాల క్లాస్లు ఉంటాయి. మా ఫ్యామిలీ కోసం కీరవాణి బాబాయ్ ఆస్కార్ వాళ్లకు మెయిల్ చేశారు. వాళ్లు అన్నీ సరిచూసుకున్న తర్వాత మెయిల్కు రిప్లై ఇస్తూ లింక్ పంపారు. అలా మేము ఒక్కో టికెట్ 1500 డాలర్లు పెట్టి కొన్నాం. మరో నలుగురి కోసం 750 డాలర్లు పెట్టి కొన్నాం. ఇదంతా అధికారికంగా జరిగింది’’
ప్రేక్షకుల ప్రేమను కొనగలమా?
‘‘సినిమా ప్రొఫైల్ పెంచడానికి డబ్బులు భారీగా ఖర్చు పెట్టామన్న ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. ఆస్కార్ కోసం కచ్చితంగా క్యాంపెయిన్ చేయాలనుకున్నాం. పబ్లిసిటీ బడ్జెట్కు లోబడే అంతా చేశాం. ఎక్కడ ఎంత అనేది ప్రతిదీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. డబ్బులు ఇస్తే ఆస్కార్ కొనుకోవచ్చన్నది పెద్ద జోక్. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూషన్ అది. అక్కడ ప్రతి దానికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక విషయం మాత్రం చెప్పగలను. ఆడియన్స్ ప్రేమను కొనగలమా?. సినిమా గురించి స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనలేం కదా. అభిమానులే సినిమాకు పెద్దగా ప్రచారం చేశారు’’ అని కార్తికేయ చెప్పారు.
‘‘ఆస్కార్ క్యాంపెయిన్ చేయడం కోసం హాలీవుడ్ సినిమా వాళ్లు పలు స్టూడియోలను ఆశ్రయిస్తారు. మాకు అలాంటి ఆస్కారం లేదు. క్యాంపెన్ కోసం మేము అనుకున్న బడ్జెట్ రూ.5 కోట్లు. అది కూడా ఎక్కువ అనిపించింది. వీలైనంత ఖర్చు తగ్గిద్దామని ప్రయత్నించాం. దాన్ని మూడు దశల్లో ఖర్చు చేయాలనుకున్నాం. మొదటి ఫేజ్లో రూ.3 కోట్లు ఖర్చు చేశాం. నామినేషన్స్ వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తం క్యాంపెన్కు రూ.ఐదారు కోట్లు అవుతుందనుకున్నాం. చివరకు రూ.8.5కోట్లు అయింది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్లో మరిన్ని స్క్రీనింగ్స్ వేయాల్సి వచ్చింది’’అని కార్తికేయ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్