Sunitha: ‘నీలాంటి వారు భూమికే భారం..’ నెటిజన్‌పై మండిపడ్డ సునీత

జీవితంలో ఎన్నో ద్వేషపు మాటలు విన్నానని, ఎంతో నెగెటివిటీని చూశానని గాయని సునీత అన్నారు. తాజాగా ఆమె సోషల్‌మీడియా వేదికగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు....

Published : 06 Feb 2022 02:21 IST

హైదరాబాద్‌: జీవితంలో ఎన్నో ద్వేషపు మాటలు విన్నానని, ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నానని గాయని సునీత అన్నారు. తాజాగా ఆమె సోషల్‌మీడియా వేదికగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె గతేడాది వ్యాపారవేత్త రామ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట ముచ్చింతల్‌లో నిర్మించిన సమతామూర్తిని దర్శించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫొటోని తన సోషల్‌మీడియా ఖాతాల్లో సునీత షేర్‌ చేశారు. దానిపై స్పందించిన పలువురు నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలపగా.. ఓ వ్యక్తి మాత్రం నెగెటివ్‌గా కామెంట్‌ చేశారు.

దీనిపై స్పందించిన సునీత.. ‘నీలాగా నెగెటివిటీని చూపించే వారు ఈ భూమికే భారం’’ అని రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానుల గురించి ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికి రుణపడి ఉంటాను. నాకోసం నిలబడే శ్రేయోభిలాషులు ఇంతమంది వున్నారని తెలుసుకుని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే వున్నాను. అయినా ఎప్పుడూ ఎవరినీ ద్వేషించే గుణం రాలేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం’’ అని సునీత అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని