కృష్ణంరాజుకు నివాళులర్పించిన చిరు 154టీమ్‌.. మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబో షురూ!

సీనియర్‌ నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Published : 12 Sep 2022 14:52 IST

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆదివారం సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తాజాగా చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు154 సెట్‌లోనూ కృష్ణంరాజుకు ఘన నివాళి సమర్పించారు. సోమవారం షూటింగ్‌ స్పాట్‌కు చేరుకొన్న చిరంజీవి, ఇతర యూనిట్‌ సభ్యులు కృష్ణంరాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.


త్రివిక్రమ్‌-మహేశ్‌ కాంబో షురూ!

మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి మహేశ్‌బాబు సెట్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, చిత్ర బృందం ఫొటోను పంచుకొంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. మహేశ్‌బాబు ఇందులో కొత్తగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని