Sarpatta: పాన్ ఇండియా సినిమాగానే భావిస్తున్నా!
‘వరుడు’ చిత్రంతో ప్రతినాయకుడిగా పరిచయమై, ‘రాజారాణి’తో ప్రేమికుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు ఆర్య. గత చిత్రాలకు భిన్నంగా పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆయన నటించిన చిత్రం ‘సార్పట్ట’. పా. రంజిత్ దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో జులై 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
‘వరుడు’ చిత్రంతో ప్రతినాయకుడిగా పరిచయమై, ‘రాజా రాణి’తో ప్రేమికుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు ఆర్య. గత సినిమాలకు భిన్నంగా పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆయన నటించిన చిత్రం ‘సార్పట్ట’. దీనికి పా.రంజిత్ దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో జులై 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆన్లైన్ వేదికగా ఆర్య ‘ఈనాడు-సినిమా’తో ముచ్చటించారు. ఆ విశేషాలివీ...
ఈ సినిమాని ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం?
ఆర్య: స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ కల ఈ సినిమాతో నిజమైంది. ఈ సినిమా స్క్రిప్టు వినగానే నచ్చేసింది. కబిలన్ పాత్ర నన్ను బాగా ఆకర్షించింది. కొత్త అనుభవాన్నిచ్చింది. నాకు మనసుకు దగ్గరైన చిత్రమిది. ప్రేక్షకులకీ నచ్చుతుందని ఆశిస్తున్నా.
‘సార్పట్ట’ గురించి ట్రైలర్లో చూపించని విషయాలు చెప్తారా?
ఆర్య: దాదాపు కథని ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశాం. 1970ల్లో సాగే కథ ఇది. అప్పటి ఉత్తర మద్రాసులో బాక్సింగ్కి బీజం ఎప్పుడు పడింది? యుద్ధ వంశాల జీవితాలు, వారి సంస్కృతి తదితర అంశాలతో రూపొందింది. కబిలన్ (ఈ సినిమాలో ఆర్య పాత్ర) ఎలా బాక్సర్ అయ్యాడు? లక్ష్యం అందుకున్నాడా? అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఫిట్నెస్ విషయంలో మీరు పర్ఫెక్ట్ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. అది ఈ పాత్రకి ఏమైనా సహకరించిందా?
ఆర్య: నేను వ్యక్తిగతంగా ఫిట్నెస్కి ప్రాధాన్యమిస్తాను. అయితే అది ఈ పాత్రకి సరిపోదు. మంచి బాక్సర్ కనిపించాలంటే అంతకుమించి శ్రమించాలి. అందుకే ఎక్కువ సమయం కసరత్తులకే కేటాయించాను. సగటు బాక్సర్గా కనిపించేందుకు కఠినమైన శిక్షణ తీసుకున్నా. పాత్రకి సంబంధించి కొన్ని వర్క్షాపుల్లో పాల్గొన్నా.
దర్శకుడు పా.రంజిత్తో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
ఆర్య: ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు పా.రంజిత్. తనకీ ఇది కొత్త నేపథ్యమే. ఎన్నో ఏళ్లు ఈ ప్రాజెక్టు కోసం రీసెర్చ్ చేశాడాయన. నాటి పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు తెరకెక్కించారు. ప్రతి పాత్ర ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. అప్పటి వాళ్లు ఎలా ఉండేవారు, ఎలా మాట్లాడేవారు, వాళ్ల బాడీ లాంగ్వేజ్ తదితర విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకుని బెస్ట్ అవుట్పుట్ని తీసుకొచ్చారు. అలాంటి ప్రతిభావంతుడితో పనిచేయడం కొత్త అనుభూతిని పంచింది.
ఇప్పటికే బాక్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటికి ‘సార్పట్ట’ భిన్నంగా ఎలా ఉండబోతుంది?
ఆర్య: బాక్సింగ్ అనేకాదు.. క్రీడా నేపథ్యంలో ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. క్రీడాకారుడు బరిలో దిగిన ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠగా సాగడమే దీనికి కారణం. బాక్సింగ్ గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో ఓ నిర్ణీత కాలానికి సంబంధించిన బాక్సర్ల వంశాల గురించి చెప్పడం ఆసక్తికరం.
ఈ సినిమాలో పాటలు ఉన్నాయా?
ఆర్య: ఈ సినిమాలో రెండు పాటలున్నాయి. ఒకటి స్ఫూర్తి రగిలించే గీతం. మరొకటి వేడుక నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి సంతోశ్ నారాయణ్ అద్భుతమైన సంగీతం అందించారు.
మీ గతం చిత్రం ‘టెడ్డీ’ సైతం ఓటీటీ ప్లాట్ఫామ్పైనే విడుదలైంది. ఈ చిత్రానికీ అదే పరిస్థితి. దీనిపై మీ అభిప్రాయం?
ఆర్య: ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదు. థియేటర్లని దృష్టిలో పెట్టుకునే సినిమాల్ని తెరకెక్కిస్తాం. కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల డిజిటల్ మాధ్యమంలో అవి ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఓ మంచి విషయం ఏంటంటే.. ఓటీటీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకి మన సినిమాలు చేరుతున్నాయి.
మీకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. మళ్లీ ఎప్పుడు తెలుగు స్ట్రైయిట్ ఫిల్మ్ చేస్తారు?
ఆర్య: ‘వరుడు’ చిత్రంతో టాలీవుడ్కి పరిచమయ్యాను. కొన్నాళ్ల క్రితం మరో తెలుగు సినిమా ‘సైజ్ జీరో’లో నటించాను. మంచి ఆదరణ లభించింది. నేరుగా తెలుగు చిత్రం చేయాలని నాకూ ఉంది. చూద్దాం.. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను.
ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పాన్ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందుతున్నాయి. మీరింకేమైనా ఇలాంటి కథల్ని విన్నారా?
ఆర్య: ‘సార్పట్ట’ని పాన్ ఇండియా స్థాయి చిత్రంగానే భావిస్తున్నా. ఎందుకంటే ఇది ఓటీటీ వేదికగా విడుదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ సినిమాని చూసే వీలుంది. కథ కూడా అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతానికి పాన్ ఇండియా కథల్ని వినలేదు.
రామ్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న ‘రాపో 19’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మీరు నటించనున్నారంటూ వార్తలొస్తున్నాయి. నిజమేనా?
ఆర్య: అది మంచి కాంబినేషన్. లింగుస్వామి పవర్ఫుల్ డైరెక్టర్. అయితే ఈ ప్రాజెక్టులో నేను నటిస్తున్నాననే వార్తల్లో నిజం లేదు.
తదుపరి ప్రాజెక్టులు?
ఆర్య: విశాల్తో కలిసి నటించిన ‘ఎనిమీ’ చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘అరన్మనై 3’ అనే తమిళ సినిమా చేస్తున్నాను.
సయేషాతో వివాహ జీవితం ఎలా ఉంది?
ఆర్య: చాలా బాగుంది. పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి ‘టెడ్డీ’ సినిమాలో నటించాం. ఆ చిత్రానికి మంచి స్పందన లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM