Janhvi Kapoor: తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్‌..

అలనాటి నటి శ్రీదేవికి ఎంతో ఇష్టమైన తిరుమలలో ఆమె పెద్దకుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వికపూర్ తళుక్కున మెరిశారు. శనివారం తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం వేకువజామున స్వామి సేవలో పాల్గొన్నారు...

Updated : 26 Dec 2021 11:40 IST

తిరుమల: తిరుమల క్షేత్రాన్ని బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్ దర్శించుకున్నారు. శనివారం తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం వేకువజామున స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ పరిసరాల్లో జాన్విని చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జాన్వి.. ‘దోస్తానా-2’, ‘గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

నటి శ్రీదేవికి తిరుమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఏడాది ఆమె తిరుమల దర్శనానికి వచ్చేవారు. తన తల్లిలానే తనకీ తిరుమల అంటే ఎంతో ఇష్టమని.. స్వామి  సన్నిధిలోనే తాను పెళ్లి చేసుకుంటానని జాన్వి ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని