Shriya: ఆయనలాగే నేనూ చివరి క్షణం వరకూ నటిస్తా: శ్రియ
‘అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) చివరి క్షణం వరకూ నటించారు. నేనూ అంతే’ అని ప్రముఖ కథానాయిక శ్రియ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) చివరి క్షణం వరకూ నటించారు. నేనూ అంతే’ అని ప్రముఖ కథానాయిక శ్రియ తెలిపారు. తాను నటించిన పాన్ ఇండియా చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకత్వం వహించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శ్రియ మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులివీ..
కథ విని ఏడ్చేశా..
సినిమాల పట్ల ఇటీవల నా అభిప్రాయం మారింది. ఇకపై ఎంపిక చేసుకునే కథలన్నీ నా కుటుంబ సభ్యుల్నీ గర్వపడేలా చేయాలనుకున్నా. అభినయానికే పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో వచ్చిందే ‘గమనం’. ఈ సినిమా కథ వినగానే నా కళ్లు చెమ్మగిల్లాయి. వెంటనే నటించేందుకు ఓకే చెప్పా. ఇందులో నేను దివ్యాంగురాలిగా కనిపిస్తా. పాత్రలో సహజత్వం ఉట్టిపడేందుకు కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా.
ఆ ఘటనతో నా హృదయం బద్దలైనా.. షూటింగ్కి వచ్చా!
మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ గురించి చెప్పేదే ఈ ‘గమనం’. ఈ చిత్రంలో మనకి మనం కనిపిస్తాం. ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య ఉంటుంది. దాన్ని అధిగమించే మార్గం ఈ సినిమాలో దర్శనమిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా ఫ్రెండ్ చనిపోయారు. నా హృదయం బద్దలైనా సరే షూటింగ్లో పాల్గొన్నా. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఈ కథ నాకు ప్రేరణగా నిలిచింది. ఈ సినిమాలో మూడు కథలు ఒకేసారి సాగుతుంటాయి. ప్రతి కథా ఎంతో స్ఫూర్తినిస్తుంది. అందరూ అనుకుంటున్నట్టు ఇది నాయికా ప్రాధాన్య చిత్రం కాదు.
వారితో కంఫర్ట్గా ఉంటుంది..
ఈ సినిమా కంటే ముందే ఇతర భాషల్లో లేడీ డైరెక్టర్లతో కలిసి పనిచేశా. మహిళల దర్శకత్వంలో నటించడం కంఫర్ట్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలున్నా నిరభ్యంతరంగా చెప్పొచ్చు. సుజనా రావు ఈ చిత్రాన్ని అద్భతంగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.
అదే నా కోరిక..
ప్రేక్షకుల అభిమానం వల్లే ఇరవై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. నా తొలి సినిమా ‘ఇష్టం’ నుంచీ నన్ను ఆదరిస్తున్నారు. నటిగా ఇంతకాలం ప్రయాణించడం కొంచెం గర్వంగా ఉంది. తుదిశ్వాస వరకూ నటించాలనేదే నా కోరిక. ఈ విషయంలో ఏఎన్నారే నాకు స్ఫూర్తి. ఆయనతో కలిసి ‘మనం’ సినిమాలో నటించా. ఆరోజుల్ని ఎప్పటికీ మరిచిపోను. ఆయన తన జీవితంలోని చివరి క్షణం వరకూ నటించారు. సినిమా పూర్తయ్యాకే చనిపోతా అంటుండేవారు.
ఇప్పుడేం చెప్పలేను..
గర్భం దాల్చిన సమయంలోనూ నేను ఫిట్నెస్ను వదల్లేదు. పిల్లలు పుడితే అందరి ప్రపంచం మారిపోతుంది. బాధ్యతలు పెరుగుతాయి. మనలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. మా పాప రాకతో ఈ విషయం నాకు తెలిసొచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఇప్పుడేం చెప్పలేను. ఇది సందర్భం కాదు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి