Kondapolam: ‘కొండపొలం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. అడవి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది.

Published : 08 Dec 2021 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. అడవి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరిస్తోంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదీ కథ: ర‌వీంద్ర‌నాథ్ (వైష్ణ‌వ్‌తేజ్‌) గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువ‌కుడు. ఉద్యోగవేట‌లో భాగంగా హైద‌రాబాద్ చేరుకుంటాడు. నాలుగేళ్లు ప్ర‌య‌త్నించినా అతనికి ఉద్యోగం రాదు. ఆత్మ‌విశ్వాస లోప‌మే త‌న‌కి శాపంగా మారుతుంది. ఎంత‌కీ ఉద్యోగం రాక‌పోవ‌డంతో తిరిగి ఊరికి చేరుకుంటాడు. తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌తాడు. అప్పుడా యువ‌కుడికి అడ‌వి ఏం నేర్పింది? అత‌నిలో వ‌చ్చిన మార్పేమిటి? యూపీఎస్‌సీలో ఐ.ఎఫ్‌.ఎస్‌కి ఎంపికయ్యేంత ఆత్మ‌విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నాడనేది మిగ‌తా క‌థ‌.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని