Radheshyam: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘రాధేశ్యామ్‌’ వేడుక

ప్రభాస్‌ కథానాయకుడిగా కె.కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే కథానాయిక. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ కీలక పాత్రలు పోషించారు....

Updated : 18 Dec 2021 08:59 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా కె.కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే కథానాయిక. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ వేడుకను ఈనెల 23న రామోజీ ఫిల్మ్‌ సిటీలో నిర్వహించనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అభిమానులే అతిథులని.. కొవిడ్‌ నిబంధనలకు పాటిస్తూ వేడుకలో పాల్గొనాలని తెలిపారు. అదే రోజున ప్రభాస్‌ అభిమానుల చేతుల మీదుగానే ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్లు విడుదల చేయనున్నారు. 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి, సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, అర్జిత్‌ సింగ్‌, మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని