Sridevi Drama Company: ‘మగధీర’, ‘బాహుబలి’.. వినోద యుద్ధానికి సిద్ధమా!

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ తాజా ప్రోమో విడుదలైంది. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతుంది.

Updated : 17 Aug 2022 10:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రామ్‌ప్రసాద్‌, ఆది బుల్లితెరపై వినోద యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. ‘మగధీర’ సినిమా స్పూఫ్‌తో రామ్‌ ప్రసాద్‌, ‘బాహుబలి’ స్పూఫ్‌తో ఆది సందడి చేయనున్నారు. ఎక్కడంటారా? ఇంకెక్కడ.. మీ అభిమాన కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో. సుధీర్‌ వ్యాఖ్యాతగా ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ఇది. సెప్టెంబరు 19న ఈ ప్రత్యేక ఎపిసోడ్ ప్రసారంకానుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆద్యంతం నవ్వులు పంచుతోంది.

‘400 సంవత్సరాల క్రితం.. కామెడీని కాపాడే వీరుడు, పేమెంట్‌ కోసం ప్రాణాలిచ్చే ధీరుడు.. ఆటో భైరవ’ అంటూ రామ్ ప్రసాద్‌ పాత్ర పరిచయంతో ఈ ప్రోమో ప్రారంభమైంది. తర్వాత ‘మగధీర’ రాజ్యం యువరాణితో రామ్ ప్రసాద్‌ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తోంది. ‘హాస్య ప్రపంచానికే రాజ్యాధినేత, పంచ్‌లతో ప్రాణాలు తీయగల వీరాధివీరుడు.. బాస్మతి సామ్రాజ్యపు ముద్దుబిడ్డ ఆదిబలి’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆది ఇచ్చిన ఎంట్రీ విశేషంగా ఆకట్టుకుంటుంది. తమ వస్త్రధారణపై తామే పంచ్‌ వేసుకుని రామ్‌ ప్రసాద్‌, ఆది నవ్వులు పూయించారు. ‘స్వయంవరం’ పేరుతో ఈ ఇద్దరూ కలిసి చేసిన స్కిట్‌ మెప్పిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటి ప్రేమ డ్యాన్సు చేసి, అలరించారు. మరి ఆటోభైరవ ‘మగధీర రాజ్యం’ గురించి ఏం చెప్తాడు? ఆదిబలి ‘బాహుబలి రాజ్యం’ కోసం ఏం చేశాడు? తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోని చూసి ఆనందించండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని