Jai Bhim: ఓటీటీకే సూర్య మొగ్గు.. కొత్త చిత్రం ఎప్పుడంటే?

ప్రముఖ కథానాయకుడు సూర్య ఓటీటీవైపు మొగ్గుచూపారు. తన తదుపరి చిత్రం ‘జై భీమ్‌’ని నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో నవంబరు నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 05 Aug 2021 14:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు సూర్య ఓటీటీవైపు మొగ్గుచూపారు. తన తదుపరి చిత్రం ‘జై భీమ్‌’ని నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో నవంబరు నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తేదీని ఇంకా ఖరారు చేయలేదు. టి.ఎస్‌.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇందులో గిరిజనుల తరఫున పోరాడే న్యాయవాదిగా కనిపించనున్నారు సూర్య. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రజిషా విజయన్‌ నాయికగా నటిస్తోంది. ప్రకాశ్‌ రాజ్‌, మణికందన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీన్‌ రోల్డాన్‌ సంగీతం అందిస్తున్నారు. కథానాయకుడిగా సూర్యకి ఇది 39వ చిత్రం. ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సూపర్‌ హిట్ తర్వాత సూర్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘జై భీమ్‌’పై కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతోపాటు సూర్య-జ్యోతిక నిర్మించిన ‘ఓ మై డాగ్‌’ (తెలుగు, తమిళం), ‘ఉడన్‌పిరప్పే’ (తెలుగు, తమిళం), ‘రామే రావనే’ (తమిళం) చిత్రాలూ అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ కానున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని