Movie Ticket Rates: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ ధర ఎంతంటే..?
కరోనా కారణంగా గడిచిన రెండు సంవత్సరాల్లో సినీ ఎగ్జిబిటర్లు ఎంతో నష్టపోయారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలిపింది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి తెలంగాణ ప్రభుత్వం జీవో నం:120ని...
హైదరాబాద్: కరోనా కారణంగా గడిచిన రెండు సంవత్సరాల్లో సినీ ఎగ్జిబిటర్లు ఎంతో నష్టపోయారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలిపింది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి తెలంగాణ ప్రభుత్వం జీవో నం 120ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. చిన్న సినిమాలకు తక్కువ ధరలోనే థియేటర్లు టికెట్లు అమ్మాలని తెలిపారు.
‘‘తెలంగాణ ప్రభుత్వం జీవో నం.120ని ప్రవేశపెట్టడం ఆనందించదగిన విషయం. ఎన్నో రోజులపాటు చర్చలు జరిపిన తర్వాత చిన్న, పెద్ద సినిమాలన్నీ లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఆ జీవోని ప్రవేశపెట్టారు. సినిమా టికెట్ ధరలు కూడా అందులోనే పొందుపరిచారు. చిన్న సినిమా టికెట్ ధరలు.. కనిష్ఠ ధర కంటే ఎక్కువగా గరిష్ఠ ధర కంటే తక్కువగా అమ్మాలని ప్రభుత్వం తెలిపింది. మధ్య స్థాయి సినిమాలు విడుదలైన రెండువారాల పాటు గరిష్ఠ ధరకు టికెట్లు అమ్మాలని.. ఆ తర్వాత దాన్ని కొంతవరకూ తగ్గించాలని సూచించింది. ఇక భారీ బడ్జెట్ చిత్రమైతే గరిష్ఠ ధరలో మూడువారాల పాటు టికెట్లు అమ్మి.. ఆ తర్వాత దాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి తెలిపారు.
‘ఏషియన్’ సునీల్ మాట్లాడుతూ.. ‘‘సినిమా టికెట్ ధరలు, థియేటర్ క్యాంటీన్లు ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓటీటీకే తమ ఓటంటూ పలువురు నెటిజన్లు సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్లందరికీ మేం చెప్పేది ఒక్కటే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల కంటే ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారు. మేమే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా కష్టాలు అర్థం చేసుకుని మాకు కొంత అండగా ఉండేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగ్గ విషయం. కానీ, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటూ తమకు అనుగుణంగా సినిమా టికెట్ ధరలు నిర్ణయించుకున్నారని తెలిసింది. వాళ్లకు మేం ఫోన్ చేసి చెప్పాం. వాళ్లు కూడా రేపటి నుంచి ధరలు తగ్గిస్తారు. జీవో నిబంధనలకు అనుగుణంగా టికెట్ని అమ్ముతారు. ఇకపై చిన్న సినిమాలన్నింటికీ తక్కువ ధరలోనే టికెట్లు అందిస్తాం. ‘ఆర్ఆర్ఆర్’కు సింగిల్ స్క్రీన్లో రూ.175, మల్టీప్లెక్స్లో అయితే రూ.295 టికెట్ ధర ఉంటుంది. అన్ని థియేటర్లు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని మేం ఇప్పటికే చెప్పాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకపోతే ఆ థియేటర్ని సీల్ చేస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది’’ అని వివరించారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.