అనసూయ చిత్రం విడుదలకు సిద్ధం

అనసూయ భరద్వాజ్‌, అశ్విన్‌ విరాజ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. ఈ థ్రిల్లర్‌ చిత్రం ఏప్రిల్‌ 30న  థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్‌ రమేశ్‌ రాపర్తి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ సమర్పణలో మాగుంట

Published : 17 Apr 2021 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనసూయ భరద్వాజ్‌, అశ్విన్‌ విరాజ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. ఈ థ్రిల్లర్‌ చిత్రం ఏప్రిల్‌ 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రమేశ్‌ రాపర్తి దీన్ని తెరకెక్కించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ సమర్పణలో మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్‌ భూమిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మౌనికారెడ్డి, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. కాగా.. యువ కథానాయకుడు నాగచైతన్య ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రత్యేకంగా వీక్షించి.. ట్రైలర్‌ చాలా బాగుందని ప్రశంసించారు. చిత్ర విడుదల తేదీని కూడా చై ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని