OTT: ఇప్పటి వరకు వారు.. ఇకపై వీరూ.. ఓటీటీ బాటలో స్టార్లు!
ఓటీటీ.. ప్రస్తుతం చాలామంది జీవితాల్లో భాగమైంది. కొత్త సినిమాలు చూడాలన్నా.. ధారావాహికలు వీక్షించాలన్నా కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు విభిన్నమైన కంటెంట్ను ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఓటీటీ (OTT).. ప్రస్తుతం చాలామంది జీవితాల్లో భాగమైంది. కొత్త సినిమాలు చూడాలన్నా.. ధారావాహికలు వీక్షించాలన్నా కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆయా సంస్థలు విభిన్నమైన కంటెంట్ను ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రూపొందుతున్నవే వెబ్ సిరీస్లు (Web Series). వీటిల్లో నటించేందుకు వర్ధమాన నటులే కాదు పేరున్న స్టార్లూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తారలు వెబ్ సిరీస్ల్లో మెరవగా త్వరలో సందడి చేయబోయే మరికొందరి వివరాలు చూద్దాం..
మల్టీస్టారర్ సిరీస్
నటుడిగా సుదీర్ఘ అనుభవమున్న వెంకటేశ్ (Venkatesh) ఓటీటీ ఎంట్రీ ఖరారు చేయడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తన సోదరుడి తనయుడు, నటుడు రానా (Rana Daggubati)తో కలిసి తాను నటిస్తున్నానని చెప్పడం అంతకుమించి అంచనాలు పెంచింది. ఈ ఇద్దరు కలిసి నటించిన సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. క్రైమ్ డ్రామా కథాంశంతో రాబోతున్న ఈ ప్రాజెక్టులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ త్వరలోనే ‘నెట్ఫ్లిక్స్’లో (Netflix) విడుదలకానుంది. రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో వెంకటేశ్ ఓ ప్రత్యేకగీతంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ను పూర్తిస్థాయిలో ‘రానా నాయుడు’లో చూడొచ్చు.
భయపెట్టే ధూత
అక్కినేని వారసుడిగా తెరపైకి వచ్చి, విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నాగచైతన్య (Naga Chaitanya). ఈయన ‘ధూత’ (Dootha) అనే సిరీస్తో ఓటీటీ బాటపట్టారు. హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాభవానీ శంకర్ కథానాయిక. ఈ సిరీస్లో చైతన్య చాలా కొత్తగా కనిపించనున్నారు. ఈ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో (Amazon Prime Video) స్ట్రీమింగ్కానుంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అక్కినేని ఫ్యామిలీతో విక్రమ్ కె. కుమార్ గతంలో ‘మనం’ చిత్రం తెరకెక్కించి, మంచి విజయం అందుకున్నారు. మరోవైపు, నాగచైతన్య హీరోగా విక్రమ్ రూపొందించిన ‘థ్యాంక్ యూ’ (Thank You) సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
నీళ్ల ట్యాంక్తో సుశాంత్
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ (Sushanth) ఒకరు. ‘కాళిదాసు’తో నటుడిగా మారిన ఈయన ‘కరెంట్’, ‘అడ్డా’, ‘,చి.ల.సౌ’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మా నీళ్ల ట్యాంక్’ (Maa Neella Tank) అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘జీ 5’లో (Zee 5) ఈ సిరీస్ విడుదలకానుంది.
పెళ్లితో రాజ్తరుణ్ సందడి
‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్ (Raj Tarun). ‘సినిమా చూపిస్త మామ’, ‘కుమారి 21 F’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘రంగుల రాట్నం’, ‘లవర్’, ‘ఒరేయ్ బుజ్జిగా’ తదితర సినిమాలతో యువతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తరుణ్ ‘అహ నా పెళ్లంట’ (Aha Naa Pellanta) అనే వెబ్ సిరీస్తో త్వరలో సందడి చేయబోతున్నారు. తాళి కట్టే సమయానికి పెళ్లి కూతురు తన ప్రియుడితో వెళ్లిపోతే ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరిపై ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ‘ఏబీసీడీ’ సినిమా ఫేం సంజీవ్ రెడ్డి ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. ఈ వినోదాత్మక ప్రాజెక్టు ‘జీ 5’లో విడుదలకానుంది. వీరితోపాటు మరికొందరు స్టార్లు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆది- లావణ్య జంటగా..
జయపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటుడు ఆది సాయికుమార్. ప్రస్తుతం ఆయన చేతిలో ‘తీస్మార్ ఖాన్’, ‘జంగిల్’, ‘కిరాతక’, ‘అమరన్’, ‘క్రేజీ ఫెలో’ తదితర చిత్రాలున్నాయి. వీటితోపాటు ‘పులి- మేక’ అనే వెబ్ సిరీస్ను పట్టాలెక్కించారు. ఇందులో ఆదికి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ, రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా ఈ సిరీస్ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ ప్రాజెక్టు ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలోకి అడుగుపెట్టిన వారు..
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో (The Family Man) సమంత, ‘లైవ్ టెలికాస్ట్’తో కాజల్ అగర్వాల్, ‘నవంబరు స్టోరీ’తో తమన్నా, ‘పిట్ట కథలు’తో శ్రుతిహాసన్, ఈషా రెబ్బా, ‘కుడి ఎడమైతే’తో అమలాపాల్, ‘చదరంగం’తో శ్రీకాంత్, ‘గ్యాంగ్స్టర్స్’తో జగపతిబాబు, ‘నవరస’తో సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, అరవింద్ స్వామి తదితరులు ప్రేక్షకుల్ని ఇప్పటికే మెప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. -
ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఇటీవల కాలంలో యూత్ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. -
ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?
బయట ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లో వరుస చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయినా, ప్రతీ వారం ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ చిత్రాలు. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి. -
‘సేవ్ ది టైగర్స్2’ రికార్డు.. ఇండియాలోనే టాప్..
కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్ ది టైగర్స్ సీజన్2 రికార్డు సృష్టించింది. -
ఓటీటీలో ‘ఫైటర్’ రికార్డులు.. ఆ హాలీవుడ్ మూవీని దాటేసింది!
Fighter ott: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
ఓటీటీలోకి విశ్వక్సేన్ ‘గామి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
విశ్వక్సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ విడుదలైంది. -
న్యూ ఏజ్ లవ్స్టోరీ ‘ప్రేమలు’.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
premalu ott release date telugu: యువతను విశేషంగా ఆకట్టుకున్న సరికొత్త చిత్రం ‘ప్రేమలు’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాజల్, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ధన్య బాలకృష్ణన్ కొత్త వెబ్సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సరికొత్త సిరీస్లు, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈటీవీ విన్లో మరో ఆసక్తికర సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘తంత్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర’ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం