Tiger Nageswara Rao: ఆ నిజాన్ని చెప్పేందుకే ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’: దర్శకుడు వంశీ
రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఫస్ట్లుక్ విడుదల కార్యక్రమాన్ని చిత్ర బృందం రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు రవితేజ (Ravi Teja) హీరోగా ‘దొంగాట’ ఫేం వంశీ (vamsee) తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ సినిమా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం.. రాజమహేంద్రవరంలోని గోదావరి వంతెనపై రవితేజ అభిమానుల సమక్షంలో ఫస్ట్లుక్ పోస్టర్ని ఆవిష్కరించింది. అనంతరం, దర్శకుడు వంశీ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలివీ..
* స్టూవర్టుపురం నేపథ్యంలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలో కొత్తగా ఏం ఉండబోతుంది?
వంశీ: నేను ఆ రెండు సినిమాలు చూశాను. వాటిల్లో చిరంజీవి సర్ నటించింది ఫిక్షన్ కథ (స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్). దర్శకుడు సాగర్ గారు తీసింది కేవలం స్టూవర్టుపురం చుట్టూ తిరిగే కథ (స్టూవర్ట్పురం దొంగలు). నేను టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తీస్తున్నా. ఆయనేం చేశారో దాన్నే తెరపైకి తీసుకొస్తున్నా.
* ఈ సినిమా కోసం రవితేజను ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?
వంశీ: ముందుగా ఈ సినిమా కోసం వేరే హీరోలను అనుకున్నా. ఆయా నటులు అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో రవితేజ సర్కి ఈ స్క్రిప్టు వినిపించా. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమాని చేరువ చేయగలిగే నటుడాయన.
* రవితేజ ఫ్యాన్స్కు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఏం ఉన్నాయి?
వంశీ: రవితేజ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో చాలా ఉన్నాయి. పోరాటాల చిత్రీకరణ కోసం రాజమహేంద్రవరం బ్రిడ్జి సెట్ని తీర్చిదిద్దాం. ఈ సినిమాలో రవితేజ పూర్తి భిన్నంగా కనిపిస్తారు. ఆయన గత చిత్రాల్లోని బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో కొంచెం కూడా కనిపించదు. రవితేజ చిత్రం ‘ధమాకా’ రూ. 100 కోట్ల వసూళ్లు చేసింది. ఈ సినిమా రూ. 1000 కోట్ల కలెక్షన్ చేయాలంటే నేను కొత్తగా ట్రై చేయాలి కదా. దానికి తగ్గట్టే కథను సిద్ధం చేశా.
* ‘దొంగల’ కథలపైనే దృష్టి పెట్టారెందుకు?
వంశీ: కావాలని అలా చేయట్లేదు (నవ్వుతూ). అనుకోకుండా జరిగిపోతోంది. ఈసారి తప్పకుండా నేపథ్యం మారుస్తా.
* ఈ బయోపిక్లో ఏ మేరకు పాజిటివ్ కోణాన్ని చూపించబోతున్నారు?
వంశీ: ఇప్పటి వరకు చాలామంది.. క్రికెటర్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల బయోపిక్లు తీశారు. నెగెటివ్ ఛాయలున్నా టైగర్ నాగేశ్వరరావు చాలామందికి తెలుసు. ఆయన చనిపోయాడని తెలిసి, భౌతిక కాయాన్ని చూసేందుకు సుమారు 3 లక్షల మంది వెళ్లారని నేను చేసిన రీసెర్చ్లో భాగంగా తెలుసుకున్నా. ఆయన జీవితంలో బయటపడని నిజమేదో దాగుందని అర్థమైంది. ఆ ట్రూత్ కోసమే ఈ చిత్రం చేస్తున్నా.
* ఈ స్టోరీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కదా. పాన్ ఇండియా స్థాయిలో ఎందుకు తెరకెక్కించాలనుకున్నారు?
వంశీ: టైగర్ నాగేశ్వరరావు పుట్టింది ఇక్కడే అయినా అన్ని ప్రాంతాల వారికి సాయం చేశాడు. ఆయన చేసిన మంచి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నాం.
ఆసక్తి రేకెత్తించేలా ‘టైగర్ నాగేశ్వరరావు’ మోషన్ పోస్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!