Trisha: ఇన్నేళైనా అదే ప్రేమ..!

స్టార్‌ కథానాయికగా చిత్రపరిశ్రమలో కొనసాగాలంటే మంచి సినిమాలే కాదు ప్రేక్షకుల ఆదరణ, వారందించిన విజయమే కారణం అంటోంది అగ్రతార త్రిష. ఎంతమంది కొత్త కథానాయికలు వచ్చిన తన క్రేజ్‌ మాత్రం అలాగే ఉంది. తమిళ చిత్రం ‘మౌనమ్‌ పెసియాదే’తో అభిమానులకు పరిచయమైన త్రిష సినీరంగంలోకి అడుగుపెట్టి 21ఏళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Updated : 15 Dec 2023 09:41 IST

స్టార్‌ కథానాయికగా చిత్రపరిశ్రమలో కొనసాగాలంటే మంచి సినిమాలే కాదు ప్రేక్షకుల ఆదరణ, వారందించిన విజయమే కారణం అంటోంది అగ్రతార త్రిష. ఎంతమంది కొత్త కథానాయికలు వచ్చిన తన క్రేజ్‌ మాత్రం అలాగే ఉంది. తమిళ చిత్రం ‘మౌనమ్‌ పెసియాదే’తో అభిమానులకు పరిచయమైన త్రిష సినీరంగంలోకి అడుగుపెట్టి 21ఏళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత కొన్నేళ్లుగా తమిళ పరిశ్రమకే అంకితమైనప్పటికీ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగి తన క్రేజ్‌ను మరింత రెట్టింపు చేసుకుంది. ఇటీవల ‘లియో’తో సందడి చేసిన ఈమె ఇన్నేళ్లు విజయవంతంగా చిత్రపరిశ్రమలో తన కెరీర్‌ను కొనసాగించినందుకు కారణమైన అందరికీ సామాజిక మాధ్యమాల ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. ఫొటోలను, వీడియోలను  పంచుకుంది. ‘నా జీవితాన్ని ఇంత అద్భుతంగా గడపడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి  మీరు చూపించిన ప్రేమే కారణం. నాకు సపోర్ట్‌గా నిలిచి, నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నా తొలి సినిమా నుంచి ఇప్పటివరకూ అదే ప్రేమనందించి నా విజయంలో భాగమైన వ్యక్తులకు థాంక్యూ. మీ ఆదరణ, ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను’ అని ఆనందంతో రాసుకొచ్చింది త్రిష.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని