Ponniyin Selvan: పాత్రను అర్థం చేసుకోడానికి పుస్తకం మొత్తం చదివాను: త్రిష

అందానికి తగిన అభినయంతో అలరించే తారల్లో త్రిష ఒకరు. టాలీవుడ్‌లోని అగ్రహీరోలందరితో కలిసి నటించింది. తాజాగా మణిరత్నం కలల సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌1’లో రాజకుమారి కుందవై పాత్రతో ప్రేక్షకులను పలకరించింది.

Published : 03 Oct 2022 01:24 IST

హైదరాబాద్‌: అందానికి తగిన అభినయంతో అలరించే తారల్లో త్రిష ఒకరు. టాలీవుడ్‌లోని అగ్రహీరోలందరితో కలిసి నటించింది. తాజాగా మణిరత్నం కలల సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌1’లో రాజకుమారి కుందవై పాత్రతో ప్రేక్షకులను పలకరించింది. ఈ పాత్రలో నటించేముందు ఆ రాజకుమారి గురించి తెలుసుకోవడం కోసం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల మొత్తం చదివినట్లు తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ..‘‘పొన్నియిన్‌ సెల్వన్‌1 సినిమా షూటింగ్‌ మొదలు పెట్టగానే ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. నేను ఆ సమయంలో కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల 5 భాగాలను మొత్తం చదివాను. చరిత్రకు సంబంధించిన పుస్తకాలను చదవడం కష్టమని నేను నమ్ముతాను. కానీ ఆ నవల మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఒక పుస్తకం అయిపోగానే మరొక  పుస్తకం మొదలుపెట్టాను. నాకు ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే 5 భాగాలున్న ఈ పుస్తకాన్ని మణిరత్నం 2 భాగాల్లో చూపించడానికి సిద్ధం చేశారు. ఇది నాకు నిజంగా ఊహకు అందడం లేదు’’ అని చెప్పింది. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష పలువురు ప్రముఖులు ఈ సినిమాలో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని