Vikram K Kumar: వంద రోజులు వర్షంలోనే చిత్రీకరించాం
‘‘ఒక సినిమా తీశాక దాని ఫలితం శుక్రవారం తొలి ఆటలోపే తెలిసిపోతుంది. కానీ వెబ్సిరీస్ల ఫలితం కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలో తెలియదు. సినిమాతో పోలిస్తే ఈ విషయంలోనే నాలో ఎక్కువ ఒత్తిడి ఉంది.
‘‘ఒక సినిమా తీశాక దాని ఫలితం శుక్రవారం తొలి ఆటలోపే తెలిసిపోతుంది. కానీ వెబ్సిరీస్ల ఫలితం కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలో తెలియదు. సినిమాతో పోలిస్తే ఈ విషయంలోనే నాలో ఎక్కువ ఒత్తిడి ఉంది. కానీ మనం చెప్పే కథ 240 దేశాల్లో, ప్రపంచం నలుమూలల్లోని ప్రేక్షకులు చూస్తారనే అంశం ఎక్కువ ఆత్రుతకి గురిచేస్తోంద’’న్నారు విక్రమ్ కె.కుమార్. ‘13 బి’, ‘ఇష్క్’, ‘మనం’ తదితర గుర్తుండిపోయే సినిమాలు చేసిన దర్శకుడాయన. తొలిసారి నాగచైతన్య ప్రధాన పాత్రధారిగా ‘దూత’ వెబ్ సిరీస్ని తెరకెక్కించారు. శరత్మరార్, విక్రమ్ కె.కుమార్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబరు 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ప్రదర్శనకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె.కుమార్ బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..
‘దూత’ సిరీస్గానే తెరకెక్కించడానికి కారణమేంటి?
కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు వీటిని రెండు గంటల్లో చెప్పేయొచ్చు అనుకుంటాం. కొన్ని ఆలోచనల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘దూత’ కథకి చాలా బలం ఉంది. ‘దూత2’, ‘దూత3’ ఆలోచనలూ ఉన్నాయి. అంత ఆసక్తిగా ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే సత్తా, పరిధి ఉన్న కథ. స్క్రీన్ప్లే రాసుకుంటున్నప్పుడు వెబ్ సిరీస్గానే రాసుకున్నా.
అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో విక్రమ్ రాసే కథలు చాలా బాగుంటాయని నాగచైతన్య అన్నారు...
నాకు ఎంతో ఇష్టమైన జానర్ ఇది. ‘13 బి’ తర్వాత చాలామంది మళ్లీ ఇదే తరహా కథ చేయమని అడిగారు. కానీ నేనే అదే ముద్ర నాపై పడే ప్రమాదం ఉందని అటువైపు వెళ్లలేదు. వెబ్సిరీస్ అవకాశం వచ్చినప్పుడు ఇన్నాళ్లూ నేను మిస్ అయిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథని ఎంచుకోవాలనుకున్నా. ఆ ప్రయత్నమే ‘దూత’. సినిమాకీ, సిరీస్ రచన పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి ఎపిసోడ్నీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ముగించాలి. రచనని చాలా ఆస్వాదించా. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది.
నాగచైతన్యని కథానాయకుడిగా ఎంచుకోవడానికి కారణం?
చైతూతో నాకు మంచి స్నేహం ఉంది. ‘మనం’ సమయంలోనే తనకి ఓ హారర్ కథ చెప్పా. నాకు దెయ్యం సినిమాలంటే భయం, నేను చూడటానికి కూడా ఇష్టపడను అన్నారు. ‘దూత’ కథ మాత్రం తనకి చాలా నచ్చింది. ఇది భయపెట్టే సిరీస్ కాదు. ఇదెలా జరిగింది? తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేకెత్తిస్తుంది. కథంతా వర్షంలోనే సాగుతుంది. వంద రోజులు వర్షంలోనే చిత్రీకరణ చేశాం. శరత్మరార్లాంటి నిర్మాత లేకపోతే ఇలా చేయడం సాధ్యమయేది కాదు.
ఇది కల్పిత కథా? లేక నిజ జీవిత సంఘటనలతో స్ఫూర్తిగా తీసుకున్నదా?
ఇది కల్పిత కథే. జర్నలిజానికీ, సూపర్ నేచురల్ అంశానికీ ఎలా ముడిపెట్టామనేది కీలకం. పరిశోధనాత్మక పాత్రికేయ వృత్తి చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. సాహసోపేతమైన వృత్తి అది. అందరూ ఆ పని చేయలేరు. అలాంటి పాత్ర నేపథ్యంలో, ప్రేక్షకులకి థ్రిల్లింగ్ అనుభవాన్నిచ్చేలా ఈ కథని మలిచా. దూత అంటే సమాచారాన్ని చేరవేసేవాడు అని అర్థం. ఒక సంఘటనని ప్రజల వద్దకి తీసుకెళ్లే జర్నలిస్ట్ కూడా దూతనే. నాగచైతన్య ఇందులో జర్నలిస్ట్గా కనిపిస్తారు. కథ రాస్తున్నప్పుడే క్రాంతి పాత్రలో పార్వతిని అనుకున్నా. తను పోలీసు అధికారిగా కనిపిస్తుంది. ప్రియ భవానీశంకర్, ప్రాచీ దేశాయ్ పాత్రలూ కీలకం. ఈ సిరీస్లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు దర్శకుడిగా చాలా సంతృప్తినిచ్చాయి. నాగచైతన్య నటన మరింత సంతృప్తినిచ్చింది.
‘దూత’ని గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అక్కడ స్పందన ఎలా ఉంది?
ఒక ఎపిసోడ్ని ప్రదర్శించాం. పూర్తి కాగానే లేచి చప్పట్లు కొట్టారు. చలన చిత్రోత్సవాల్లో సహజంగా జరిగేదేనేమో తెలియదుకానీ.. ఆ తర్వాత మా ప్రసంగాన్ని కూడా అంతే ఆసక్తిగా విన్నారు. అక్కడ ప్రదర్శన మంచి అనుభవం.
మీకు ఇష్టమైన వెబ్ సిరీస్లు ఏవి?
‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘పాతాళ్లోక్’, ‘స్కాం’, మీర్జాపూర్’, ‘జూబ్లీ’.. ఇలా చాలా సిరీస్లు ఇష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. -
బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. -
శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘థగ్లైఫ్’ గీత రచయితగా..
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. -
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్